HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Temple Tragedies

AP Temple Tragedies : ఎందుకు.. ఏపీలో వరుసగా దేవాలయాల్లో విషాద ఘటనలు ?

AP Temple Tragedies : నేడు విశాఖ సింహాచలం చందనోత్సవం (Simhachalam Chandanotsavam)లో గోడకూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు

  • By Sudheer Published Date - 01:07 PM, Wed - 30 April 25
  • daily-hunt
Ap Temple Tragedies
Ap Temple Tragedies

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ దేవాలయాల్లో ఇటీవల వరుసగా జరిగే విషాద ఘటనలు(Temple Tragedies) భక్తుల్లో (Devotees) తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. నాలుగు నెలల్లో రెండు పెద్ద ప్రమాదాలు చోటుచేసుకోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. జనవరిలో తిరుపతి వైకుంఠ ఏకాదశి (Tirupati Vaikuntha Ekadashi) సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటన మరువకముందే, నేడు విశాఖ సింహాచలం చందనోత్సవం (Simhachalam Chandanotsavam)లో గోడకూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో “ఏం జరుగుతోంది? దేవుళ్లకు కోపం వచ్చిందా? లేక మానవ తప్పిదాల ఫలితమా? అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PM Modi AP Tour : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ .. ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత

తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు భక్తులను ఒక్కసారిగా క్యూలైన్‌ల్లోకి అనుమతించడం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇదే తరహాలో సింహాచలంలో కూడా గోడ కూలి భక్తులే మృతి చెందారు. ఆలయ పరిసరాల్లో రిటైనింగ్ వాల్‌ను తక్కువ నాణ్యత గల ఫ్లైయాష్ బ్రిక్స్‌తో నిర్మించడం వల్ల వర్షపు నీరుతో అది కూలిపోయింది. ప్రమాద స్థలంలో నిర్మాణ నిబంధనలను పాటించకపోవడం, భద్రతా జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని తెలుస్తుంది.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం తీవ్రంగా ఏర్పడింది. మానవ తప్పిదాలు తిరగలేని ముప్పుగా మారుతున్నాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు నాణ్యమైన ఫౌండేషన్, కాంక్రీట్ నిర్మాణాలు తప్పనిసరి. స్వామి కోపిస్తే ఇలా జరుగుతుందన్న భక్తుల విశ్వాసం కంటే ముందు, యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలి. లేదంటే, ఎప్పటికప్పుడు దేవాలయాలు విషాద వేదికలుగా మారే ప్రమాదం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Temple Tragedies
  • Devotees dies
  • Simhachalam Chandanotsavam
  • Temple Tragedies
  • Tirupati Vaikuntha Ekadashi

Related News

    Latest News

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • ‎Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

    • Tulasi Plant: ‎తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!

    Trending News

      • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

      • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

      • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd