AP : వైసీపీ జెండా కాల్చాడని.. వ్యక్తిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన పోలీసులు
- By Sudheer Published Date - 09:34 PM, Mon - 8 January 24
అధికారం చేతిలో ఉందని ఏపీలో పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో..అసలు ఏంచేస్తున్నామో అనేది కూడా చూడకుండా..మీము మనుషులమే అనేది కూడా మరచిపోయే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతుంటే..మరికొంతమంది మీము పోలీసులం..మీము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తీరుగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా వైసీపీ జెండా కాల్చాడని టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోలీసులు నగ్నంగా చేసి కొడుతూ ఊరేగించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో చోటుచేసుకుంది. దీనికి సంబదించిన వీడియో ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైసీపీ జెండాను కాల్చేశారనే ఆరోపణలపై టీడీపీ కార్యకర్త, బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన చంద్రమోహన్ను అరెస్టు చేసిన పోలీసులు.. నగ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరం చూశాక తన గుండె చెదిరిపోయిందన్నారు. వైసీపీ ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకోవటం ఏపీలో రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. రాక్షస రాజులు కూడా సైకో జగన్లాంటి దుర్మార్గచర్యలకు పాల్పడలేదని లోకేష్ విమర్శలు గుప్పించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన మీరు ప్రజాధనం జీతంగా తీసుకునే పోలీసులా ? ఫ్యాక్షనిస్టు జగన్ కిరాయి సైన్యమా? అంటూ పోలీసులను లోకేష్ ప్రశ్నించారు.
ఒక కరడుగట్టిన నేరగాడు పెట్టిన పార్టీ జెండా అంత పవిత్రమైనదా అంటూ వైసీపీ జెండా గురించి వ్యాఖ్యలు చేసిన లోకేష్ జాతీయ జెండా పెడతామనడం నేరమా? అంటూ నిలదీశారు. మా టిడిపి సైనికుడు చంద్రమోహన్ ను నగ్నంగా ఊరేగించారు, పక్కటెముకలు విరగ్గొట్టారు. మీరు చేసిన నరరూప రాక్షస చర్యలకు చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ లోకేష్ పోలీసులను హెచ్చరించారు.
ఇదొక్కటే వైసీపీ అండతో చాలామంది పోలీసులు చాలాసార్లు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి..జైల్లో చితకబాదిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఘటన తో ఇప్పుడు మరోసారి పోలీసుల తీరు బయటపడింది. ఈ ఘటన ఫై టీడీపీ శ్రేణులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైకాపా ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది. రాక్షస రాజులు కూడా సైకో జగన్లాంటి దుర్మార్గచర్యలకు పాల్పడలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైకాపా జెండాని కాల్చేశారనే ఆరోపణలపై టిడిపి కార్యకర్త బీసీ… pic.twitter.com/9BLdFEiB67
— Lokesh Nara (@naralokesh) January 8, 2024
Read Also : World’s Rarest Blood Groups : ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఏదో మీకు తెలుసా..?
Related News
Pawan-Lokesh : పవన్ – లోకేష్ మధ్య కామన్ పాయింట్స్.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఉత్తర దక్షిణ ధృవాలుగా కనిపిస్తున్నారు.