HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Police Association Fires On Chandrababu Naidu Regarding Punganur Issue

Chandrababu : చంద్రబాబు పోలీసులకు క్షమాపణలు చెప్పాలి.. పుంగ‌నూరు ఘ‌ట‌న‌పై పోలీసు సంఘం అధికారులు ఫైర్..

పుంగనూరు ఘటనను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. చంద్రబాబుపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫైర్ అయింది.

  • Author : News Desk Date : 05-08-2023 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Police Association fires on Chandrababu Naidu regarding Punganur Issue
AP Police Association fires on Chandrababu Naidu regarding Punganur Issue

టీడీపీ(TDP) క్యాడ‌ర్ ను అణ‌చివేయ‌డానికి వైసీపీ ఎప్పట్నుంచో పోలీసుల‌ను వాడుకుంటోంది అని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు(Chittoor) జిల్లా పుంగ‌నూరు(Punganur) ఘ‌ట‌న‌లోనూ అదే జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ(YCP) శ్రేణుల మ‌ధ్య రాళ్ల దాడి జ‌రిగింది. కానీ ఈ రాళ్ళ దాడిలో కేవలం టీడీపీకి చెందిన 50 మందిని అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. దీంతో పోలీసులపై టీడీపీ నేతల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి.

తాజాగా పోలీసులు(Police) మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు వైసీపీ నాయకులే మాట్లాడించినట్టు ఉంది. పుంగనూరు ఘటనను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. చంద్రబాబుపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫైర్ అయింది. పుంగనూరు ఘటనపై పోలీసు అధికారుల సంఘం తాజగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. ఈ ఘటనతో ఒక పథకం ప్రకారమే పోలీసులను హతమార్చే భారీ కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిమీద ఎంక్వైరీ జరిపించాలి. పోలీసులపై దాడి జరుగినా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజలు ఎవ్వరూ సానుభూతి చూపలేదు. పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోలీసులపై కొంతమంది ఉద్ధేశపూర్వకంగానే దాడి చేశారు. 50 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. 13 మంది ఆసుపత్రిలో ఉన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. మీ ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో మేం పనిచేశాం. మేం ఏ పార్టీకి అనుకూలంగా ఎన్నడూ పనిచేయలేదు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటన దురదృష్టకరం. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించాలని చూశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం ఉన్నా మా డ్యూటీ మేము చేస్తున్నాం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారు. నిన్న జరిగిన ఘటనతో మా కుటుంబాల్లో భయం పట్టుకొంది. డీజీపీ గారికి మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఉద్యోగాలు చేయాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కోరుతున్నాం. ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మేము డ్యూటీ మాత్రమే చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి చేతులెత్తి మొక్కుతున్నాం. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు అని అన్నారు.

ఇక పోలీసు సంఘం జాయింట్ సెక్రటరీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మేం ప్రభుత్వ ఉద్యోగులం. రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. రాళ్లు వేయడం, విధ్వంసానికి పాల్పడటం సంఘవిద్రోహ శక్తుల లక్షణాలు. పోలీసులపై దాడులు చేసి ఏం చేయాలని చూస్తున్నారు. ఎటువంటి మెసేజ్ సమాజానికి ఇవ్వాలని చూస్తున్నారు. తక్షణమే చంద్రబాబు పోలీసులకు క్షమాపణ చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే పుంగనూరు ఘటనపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు వైసీపీ నాయకులూ మాట్లాడినట్టే ఉందని, ప్రభుత్వం పోలీసులతో అలా మాట్లాడించిందని, వైసీపీ వాళ్ళు కూడా దాయాది చేసినా క్కర్ని కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదని, వాళ్ళ గురించి మాత్రం మాట్లాడలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ తో పోలీసులపై ప్రజల్లో కూడా విమర్శలు వస్తున్నాయి.

 

Also Read : Chandrababu: సీమ సాగునీటి ప్రాజెక్టులపై CBN ప్రజెంటేషన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Police Association
  • chandrababu naidu
  • police
  • Punganur Issue

Related News

Mittal Plant Foundation Sto

Mittal Plant : రేపే మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన..65 వేలమందికి ఉపాధి

ఈ మెగా ప్లాంట్ పనులను 2033 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం మరియు సదరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా

    Latest News

    • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

    • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

    • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

    • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

    • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd