HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Governor Speech In Assembly Sessions

AP Governor Speech : ఏపీ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది – గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉభ‌య స‌భల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

  • Author : Hashtag U Date : 07-03-2022 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Governor
Ap Governor

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉభ‌య స‌భల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. 2020-21 నుంచి నాడు-నేడు పనుల కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. వికేంద్రీకృత, సమ్మిళిత ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం గత మూడేళ్లుగా కృషి చేస్తోందన్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ.13,023 కోట్లు ఖర్చు చేశామ‌ని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదలు మరియు బలహీన వర్గాలకు సహాయం అందించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2020-21 సంవత్సరంలో 16.82 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందని.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుందని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామని చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. మన బడి నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేశామ‌ని.. తొలి దశలలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలలను అభివృద్ధి చేశామ‌న్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.13,023 కోట్లు అందజేశామ‌ని.. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామ‌న్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించామ‌ని.. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13, 500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని.. ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు రూ.20,162 కోట్ల సాయం అందింద‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింద‌ని…2021-22లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం చేకూర్చా\మ‌న్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,04,758 గా ఉందన్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందించాంమ‌ని.. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు సాయం అందిస్తున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కోన్నారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులకు రూ.583 కోట్లు సాయం అందించామ‌ని… 2.7 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.770 కోట్ల సాయం చేశామ‌న్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం ..వైఎస్ఆర్ ఆసరా కింద 78.75 లక్షల మందికి సాయం, స్వయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు అందించామ‌న్నారు. వైఎస్ఆర్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.75వేల చొప్పున కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ.981.88 కోట్లు అందించామ‌న్నారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి అర్హులైన ఒక్కొక్కరికీ రూ.15వేల సాయం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్ల సాయం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.2,354 కోట్లు అందించామ‌న్నారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లు వ్యయంతో 3 వేల కి.మీ పొడవైన 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడ‌ని.. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులుపూర్తి చేస్తామ‌న్నారు.

మరోవైపు టీడీపీ నేతల నిరసనల మధ్య గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి గాల్లోకి విసిరేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం ప్రారంభం కాగానే టీడీపీ నేతలు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు. రాజ్యాంగ వ్యవస్థను రక్షించడం లేదంటూ గో బ్యాక్‌ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి సభలో నిరసన తెలిపిన టీడీపీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వారు సభ నుంచి వాకౌట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • AP Governor biswabhusan harichandan

Related News

Sajjala

రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  • Cbn Sha

    అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

Latest News

  • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

  • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

  • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

  • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

  • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

Trending News

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd