Eluru child case: శిశు విక్రయం కేసులో ట్విస్ట్.. మాజీ మంత్రి కొడుకు ప్రమేయం!
ఏపీలోని ఏలూరు శిశువుల (చిన్నపిల్లలు) విక్రయం కేసులో కొత్త ట్విస్ట్.
- By Balu J Published Date - 05:07 PM, Sat - 27 August 22
ఏపీలోని ఏలూరు శిశువుల (చిన్నపిల్లలు) విక్రయం కేసులో కొత్త ట్విస్ట్. మాజీ మంత్రి సనక్కాయల అరుణ కుమారుడు డాక్టర్ సనక్కాయల ఉమాశంకర్ కుమారుడి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి, ఆధారాలు సేకరించారు. గుంటూరు కొత్తపేటలోని అహల్య నర్సింగ్హోమ్లో శిశువుల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ ఉమాశంకర్ను విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందం గుంటూరు వెళ్లింది. అయితే పోలీసుల సందర్శనకు వాళ్ల అచూకీ దొరకలేదు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందం ప్రయత్నిస్తోంది. సమాచారం మేరకు పోలీసులు, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో అప్పుడే పుట్టిన శిశువును ఏలూరులో అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన మైనర్ బాలిక చిన్నారి అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు శిశువును రూ.2.70 లక్షలకు విక్రయించేందుకు అంగీకరించారని, ఆశా వర్కర్లు అమ్మకందారులకు, కొనుగోలుదారులకు మధ్య దళారులుగా పనిచేస్తున్నారని విచారణలో పోలీసులకు తెలిసింది. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 11వ నిందితుడు డాక్టర్ ఉమాశంకర్ కోసం గాలిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరుకు చెందిన కొన్ని ముఠాలు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ తెలిపారు.
Related News
AP : మహిళలపై దాడులు చేస్తున్న పట్టించుకోని ఏపీ పోలీస్ – చంద్రబాబు
టీడీపీ నేతలపైనే కాదు కార్యకర్తలపై కూడా దాడులకు తెగపడుతున్నారు. పల్నాడు, తిరుపతి , అనంతపురం , తాడిపత్రి తదితర జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేసిన వైసీపీ రౌడీ మూక..ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్ ను కూడా వదలడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వాపోయారు