HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Employees High Court Gives Stay On Jagan Governments Notice On Employees

AP Employees : ఏపీ ఉద్యోగ సంఘం విజ‌యం! `సుప్రీం` దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ !

ఏపీ ఉద్యోగుల‌కు(AP Employees)  హైకోర్టులో తాత్కాలిక ఊర‌ట ల‌భించింది.

  • By CS Rao Published Date - 03:53 PM, Wed - 15 February 23
  • daily-hunt
Ap Employees
Ap Employees

ఏపీ ఉద్యోగుల‌కు(AP Employees)  హైకోర్టులో తాత్కాలిక ఊర‌ట ల‌భించింది. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టు వ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ద‌మ‌యింద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ కు ఏపీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేయ‌డాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి( Jagan) స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ నోటీసులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. వాళ్ల మీద చ‌ర్యలు తీసుకోవ‌డానికి ముందడుగు వేసింది.

ఏపీ ఉద్యోగుల‌కు హైకోర్టులో తాత్కాలిక ఊర‌ట(AP Employees)  

ప్ర‌భుత్వం జారీ చేసిన నోటీసును స‌వాల్ చేస్తూ హైకోర్టుకు ఏపీ ఉద్యోగుల సంఘం నాయ‌కులు(AP Employees) వెళ్లారు. వాళ్లి పిటిష‌న్ మీద బుధ‌వారం విచారించిన హైకోర్టు జస్టిస్ రవినాథ్ తిలహరి స్టే మంజూరు చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఉద్యోగుల‌కు ల‌భించింది. అయితే, ఆ ఫిర్యాదు వెనుక ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఉన్నాయ‌ని వైసీపీ అనుమానిస్తోంది. రాజ‌కీయ ప‌రంగా చంద్ర‌బాబుకు ప‌రోక్ష మ‌ద్ధ‌తు ఏపీజీఈఏ అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ అందిస్తున్నార‌ని భావిస్తోంది. అందుకే, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉండే ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను వైసీపీ(Jagan) చేర‌తీసింది. వాళ్ల‌తోనే సూర్య‌నారాయ‌ణ మీద ఆరోప‌ణ‌లు చేసేలా ప్లాన్ చేసింది.

Also Read : AP Employees : ఉద్యోగ సంఘం నేతకు జగన్ మార్క్ తీర్పు?బండి తడాఖా

ఏపీజీఈఏ అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జనవరి 19న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను క‌లిసింది. ఉద్యోగులు  ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం జోక్యం చేసుకావాల‌ని కోరారు. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు ఇవ్వాలని ప్రతినిధి బృందం గవర్నర్‌ను అభ్యర్థించింది. ఆ భేటీ త‌రువాత ఏపీజీఈఏ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం(Jagan) ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనందున గవర్నర్‌ను కలవాల్సి వచ్చిందన్నారు.

సంఘానికి ఎందుకు గుర్తింపు ర‌ద్దు చేయ‌కూడ‌దో..

ఏపీజీఈఏ నేతల (AP Employees) చర్యను సీరియస్‌గా ఆనాడే ప్రభుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. సంఘానికి ఎందుకు గుర్తింపు ర‌ద్దు చేయ‌కూడ‌దో వివరించాలని కోరుతూ జనవరి 23న షోకాజ్ నోటీసు జారీ చేసింది. సూర్యనారాయణ ఆ షోకాజ్ నోటీసును హైకోర్టులో సవాలు చేశారు. సంఘంపై చర్యలు తీసుకోవద్దని జనవరి 31న కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లోని హక్కులు గురించి ప్ర‌స్తావించారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగ సంఘం నేత‌లు నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

న్యాయ‌పోరాటం చేయ‌డానికి ప్ర‌భుత్వం ముందుకెళ్ల‌నుంద‌ని..(Jagan)

1990 ఆర్థిక నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు(AP Employees) ప్రతినెలా చివరి పనిదినాన జీతాలు చెల్లించాల‌ని కోరారు. అయితే వచ్చే నెల 15 వరకు ఉద్యోగులకు ప్రస్తుత నెల జీతాలు అందడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రవిప్రసాద్ కోర్టుకు తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం లేదని సూర్యనారాయణ ఆరోపించారు. 90వేల‌ మందికి పైగా ఉద్యోగుల ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండానే ప్రభుత్వం రూ.415 కోట్ల జీపీఎఫ్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసిందని ఉద్యోగ సంఘం నేత‌లు న్యాయ‌స్థానం ముందు ఉంచారు. హైకోర్టులో ఉద్యోగ సంఘానికి ఊర‌ట ల‌భించిన‌ప్ప‌టికీ న్యాయ‌పోరాటం చేయ‌డానికి ప్ర‌భుత్వం(Jagan) ముందుకెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.

Also Read : AP Employees : జీతాలిస్తే చాలు,ఇంకేమొద్దు! ఉద్యోగుల‌కు త‌త్త్వం బోధ‌ప‌డి.!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • Andhra Pradesh High Court
  • ap employees
  • Supreme Court

Related News

Supreme Court Dismissed The

Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది

  • Jacqueline Fernandez

    Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మోసం కేసు.. స్టార్ హీరోయిన్‌కు సుప్రీంకోర్టులో షాక్‌!

  • Vijayawada Utsav Sh

    Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd