AP Congress : మరో లిస్ట్ వచ్చేసింది.. 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
AP Congress : కాంగ్రెస్ పార్టీ తాజాగా సోమవారం మరో 38 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.
- By Pasha Published Date - 01:56 PM, Mon - 22 April 24
AP Congress : కాంగ్రెస్ పార్టీ తాజాగా సోమవారం మరో 38 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను హస్తం పార్టీ(AP Congress) అధిష్టానం అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పటివరకు అనౌన్స్ చేసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 142కు చేరింది. ఈ లిస్టును సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా ఏపీలోని అరకు లోక్ సభ స్థానంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కాంగ్రెస్ కేటాయించింది. ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది., దీంతో ఇప్పటివరకు ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల సంఖ్య 20కి చేరింది. మరో 4 ఎంపీ స్థానాలు, మిగతా అసెంబ్లీ సీట్లకు కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు వీరే
1. శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
2. బొబ్బిలి- మురిపి విద్యాసాగర్
3. గజపతినగరం – దోలా శ్రీనివాస్ (కురిమినాయుడు స్థానంలో)
4. నెల్లిమర్ల – ఎస్.రమేశ్ కుమార్
5. విశాఖ ఉత్తరం – లక్కరాజు రామారావు
6. చోడవరం – జగత్ శ్రీనివాసరావు
7. యలమంచిలి – టి.నర్సింగ్ రావు
8. అచంట – నెక్కంటి వెంకట సత్యనారాయణ
9. పి.గన్నవరం (ఎస్సీ) – కె.చిట్టిబాబు
10. విజయవాడ ఈస్ట్ – సుంకర పద్మశ్రీ
11. జగ్గయ్యపేట – కర్నాటి అప్పారావు
12. తాడికొండ (ఎస్సీ) స్థానంలో మణిచల సుశీల్ రాజా (చిలకా విజయ్ కుమార్ స్థానంలో)
13. రేపల్లె – మోపిదేవి శ్రీనివాసరావు
14. తెనాలి – ఎస్ కే బషీద్
15. చీరాల – ఆమంచి కృష్ణమోహన్
16. ఒంగోలు – తుర్లపాక నాగలక్ష్మి (బుట్టి రమేశ్ బాబు స్థానంలో)
17. గుంటూరు వెస్ట్ – డాక్టర్ రాచకొండ జాన్ బాబు
18. కనిగిరి – దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
19. కావలి – పొదలకూరి కల్యాణ్
Also Read : Everest – MDH : ఎవరెస్ట్, ఎండీహెచ్లకు షాక్.. మసాలా ఉత్పత్తులపై మరో బ్యాన్
20. కోవూరు – నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో)
21. సర్వేపల్లి – పి.వి.శ్రీకాంత్ రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)
22. గూడూరు (ఎస్సీ) – డాక్టర్ యు.రామకృష్ణారావు (చిలుకూరి వేమయ్య స్థానంలో)
23. వెంకటగిరి – పి.శ్రీనివాసులు
24. సూళ్లూరుపేట (ఎస్సీ) – చందనమూడి శివ (గడి తిలక్ బాబు స్థానంలో)
25. కడప – తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
26. పులివెందుల – మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
27. జమ్మలమడుగు – పాముల బ్రహ్మానందరెడ్డి
28. ప్రొద్దుటూరు – షేక్ పూల మహ్మద్ నజీర్
29. మైదుకూరు – గుండ్లకుంట శ్రీరాములు
30. ఆళ్లగడ్డ – బారగొడ్ల హుస్సేన్
31. శ్రీశైలం – అసర్ సయ్యద్ ఇస్మాయిల్
32. బనగానపల్లె – గూటం పుల్లయ్య
33. డోన్ – గారపాటి మధులెట్టి స్వామి
34. ఆదోని – గొల్ల రమేశ్
35. ఆలూరు – నవీన్ కిషోర్ ఆరకట్ల
36. కల్యాణదుర్గం – పి.రాంభూపాల్ రెడ్డి
37. హిందూపురం – మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి.నాగరాజు స్థానంలో)
38. ధర్మవరం – రంగాన అశ్వర్థ నారాయణ
Also Read :Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ ఓకే.. మరి కల్కికి ట్రైనింగ్ ఇచ్చే పరశురాముడు ఎవరు..?
Related News
Amith Sha : రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం – అమిత్ షా
ఇక 'పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం' అని అమిత్ షా హామీ హామీ ఇచ్చారు.