AP BJP Assembly Candidates : ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది
- By Sudheer Published Date - 07:28 PM, Wed - 27 March 24
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను బిజెపి ప్రకటించింది. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఆరు ఎంపీ సీట్లను ఇప్పటికే ప్రకటించగా..ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు.
అసెంబ్లీ బరిలో పోటీ చేసే అభ్యర్థులు వీరే..
* ఎచ్చెర్ల – ఈశ్వరరావు
* విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
* అరకు వ్యాలీ – రాజారావు
*అనపర్తి – శివకృష్ణంరాజు
* కైకలూరు – కామినేని శ్రీనివాస్
* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
* బద్వేల్ – బొజ్జ రోశన్న
* జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి
* ఆదోని – పార్థసారథి
* ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక లోక్ సభ అభ్యర్థులు చూస్తే..
* అరకు – కొత్తపల్లి గీత
* అనకాపల్లి – సీఎం రమేష్
* రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
* నర్సాపురం – భూపతిరాజు శ్రీనివాసవర్మ
* తిరుపతి – వరప్రసాదరావు
* రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి లు బరిలోకి దిగుతున్నారు.
Related News
Mallikarjun Kharge : బీజేపీ వస్తే రాజ్యాంగం మారిపోతుంది
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ముస్లిం లీగ్కు ప్రతిరూపమని బీజేపీ చేసిన ఆరోపణను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు, ‘నరేంద్ర మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ ఎప్పుడూ విజయవంతం కాదన్నారు.