HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Andhra Pradesh Prc Panel Report Disappoints Employees Associations

AP PRC Issue : ‘నిర్మ‌ల‌మ్మ‌’ సోయ ‘సజ్జ‌ల‌’కు లేక‌పాయే.!

ఏపీ ఉద్యోగ సంఘం నేత‌లు ప్ర‌భుత్వాన్ని, కార్య‌నిర్వాహ‌ణ వ్య‌వ‌స్థ‌ను శాసించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • By CS Rao Published Date - 01:20 PM, Wed - 15 December 21
  • daily-hunt
Sajjala Nirmala
Sajjala Nirmala

ఏపీ ఉద్యోగ సంఘం నేత‌లు ప్ర‌భుత్వాన్ని, కార్య‌నిర్వాహ‌ణ వ్య‌వ‌స్థ‌ను శాసించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నేరుగా సీఎం జ‌గ‌న్ తోనే తేల్చుకుంటామ‌నే స్థాయికి వ‌చ్చారు. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టగ‌లం..నిల‌బెట్ట‌గ‌లం అంటూ వారం క్రితం ఉద్యోగ సంఘం నేత‌లు బండి శ్రీనివాసరావు, బొప్ప‌రాజు వార్నింగ్ ఇచ్చారు. ఆ త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌తిరేక‌త పెల్లుబికింది. దాంతో వాళ్లు నాలుక‌ను స‌వ‌రించుకునే ప్ర‌య‌త్నం చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ ఇచ్చిన పీఆర్సీ నివేదిక పై వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, ఐఏఎస్ లు చెప్పిన మాట‌లు వినొద్ద‌ని, వాళ్లు ఇచ్చిన సిఫార‌స్సులు చెల్ల‌వ‌ని సీఎం జ‌గ‌న్ కు శుద్ధులు చెబుతున్నాడు బండి శ్రీనివాస‌రావు.
ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు, సీఎం జ‌గ‌న్ కు మ‌ధ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఉన్నాడు. ఆయ‌న ఉద్యోగుల ప‌క్షాన తొలి రోజుల్లో నిలిచాడు. అన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించి ఉద్యోగుల‌ను సున్నితంగా మంద‌లించాడు. రాజ‌కీయ ప్ర‌మేయంతో కూడిన మాటలు ఆపండ‌ని హిత‌వు ప‌లికాడు. కానీ, ఏపీ ఆర్థిక ప‌రిస్థితి గురించి ఉద్యోగుల‌కు న‌చ్చ చెప్ప‌డంలో స‌జ్జ‌ల విఫ‌లం అయ్యాడు. పీఆర్సీ సిఫార‌స్సుల‌ను వ్య‌తిరేకిస్తోన్న ఉద్యోగ సంఘ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు. ఐఏఎస్ ల సిఫార‌స్సుల‌ను ప‌క్క‌న పెట్ట‌మ‌ని వార్నింగ్ ఇస్తోన్న బండి శ్రీనివాస‌రావు లాంటి వాళ్ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంపై సజ్జ‌ల విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నాడు.

KCR Politics : ఔను! వాళ్లిద్ద‌రూ చెరోదారి!!

దేశంలోని ఏ రాష్ట్ర ఉద్యోగుల‌కు ఇవ్వ‌నంత‌గా ఏపీ ఉద్యోగులకు ల‌బ్ది చేకూరుతోంది. తెలంగాణ ఉద్యోగుల కంటే ఎక్కువ‌గా జీతాల‌ను, పెన్ష‌న్ల‌ను అనుభ‌విస్తున్నారు. ఆ మేర‌కు 14వ ఆర్థిక సంఘం నివేదిక‌ను ప‌రిశీలిస్తే అర్థం అవుతోంది. రాష్ట్రం మొత్తం ఖ‌ర్చులో 60శాతం వ‌ర‌కు ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కు వెళుతోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత వాటా ఉద్యోగుల‌కు లేద‌ని స‌మీర్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ తేల్చింది.వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్టిన ఐఏఎస్ ల‌ను ఇప్పుడు ఏపీ ఉద్యోగ సంఘాల నేత‌లు టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మంగ‌ళ‌వారం విడ‌మ‌రిచి చెప్పింది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ఏపీలో క‌నిపించ‌డంలేద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా మొత్తుకుంది. కేంద్రం సైతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందుతోంది. కానీ, ఉద్యోగులు మాత్రం గొంత‌మ్మ కోర్కెలు తీర్చాల‌ని 71 డిమాండ్ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు పెట్టారు.
రాజ‌కీయ ల‌బ్ది కోసం విప‌క్ష పార్టీలు కూడా ఉద్యోగ సంఘాల‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నాయి. టీడీపీతో పాటు మిగిలిన రాజ‌కీయ పార్టీలు ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని ప‌ట్టించుకోకుండా ఉద్యోగుల‌కు పీఆర్సీ ఇవ్వాల‌ని చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిణామ‌మే గ‌తం నుంచి ఉద్యోగులకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికైనా ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని అటు ప్ర‌భుత్వం ఇటు విప‌క్షాలు మాట్లాడాలి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచించ‌క‌పోతే, భ‌విష్య‌త్ లో కొంద‌రు ఉద్యోగుల `బ్లాక్ మెయిల్ ` కు అనుగుణంగా ప్ర‌భుత్వాల‌ను న‌డ‌పాల్సిన అగ‌త్యం ఏర్ప‌డుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap finance minister
  • nirmala seetharaman
  • sajjala ramakrishna reddy

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

    Latest News

    • Election of the Vice President: ఏ పార్టీ ఎవరికీ మద్దతు ఇస్తుందో తెలుసా.?

    • Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్

    • Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్

    • Allu Kanakaratnam: అల్లు కనకరత్నం పెద్దకర్మ.. స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కల్యాణే

    • KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd