CM Jagan: మంత్రుల జాబితాలు సిద్ధం!
పాత క్యాబినెట్ లోని మంత్రులను తిరిగి కొనసాగించే జాబితా ఒకటి. కొత్త మంత్రుల పేర్లతో మరో జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.
- By CS Rao Published Date - 02:37 PM, Sat - 9 April 22
పాత క్యాబినెట్ లోని మంత్రులను తిరిగి కొనసాగించే జాబితా ఒకటి. కొత్త మంత్రుల పేర్లతో మరో జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆ రెండు. జాబితాలను గవర్నర్ కార్యాలయానికి పంపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శనివారం రాత్రికి సిద్ధమైన మంత్రుల జాబితా గవర్నర్ ఆఫీస్ కు చేరనుంది. అంతేకాదు, ఆయా మంత్రులకు ఫోన్ ద్వారా సమాచారం కూడా ఇవ్వనున్నారు. ఈనెల 11వ తేదీన ప్రమాణస్వీకారానికి సిద్ధం కావాలని ఫోన్ మెసేజ్ ఇవ్వనున్నారు. కొత్త మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గంలోకి కొత్త మంత్రుల చేరికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులతో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పదవీకాలం కొనసాగించే మంత్రుల జాబితాతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ నెల 11న జరగనున్న ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఏప్రిల్ 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బ్లూబుక్లోని నిబంధనల ప్రకారం కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 24 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఇదిలా ఉంటే, పాత కేబినెట్లోని సీనియర్లను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. పనితీరు, కుల సమీకరణాలు, ఇతర అంశాల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ పది మంది మంత్రులను కొనసాగించే అవకాశం ఉంది. ఊహాగానాల ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, వేణుగోపాల్, గుమ్మనూరు జయరామ్, ఆదిమూలపు సురేష్, అంజాత్ బాషాలను కొనసాగించే పాత మంత్రుల జాబితాలో ఉన్నారు. కొత్త కేబినెట్లో ఒకరిద్దరు మంత్రులకు మాత్రమే ఇవ్వానలి నిర్ణయించుకున్న వైఎస్ జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లు చాలా కీలకం కావడంతో సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.
Related News
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి