Shivling: పోలవరం ప్రాజెక్టులో పురాతన శివలింగం
జాతీయ ప్రాజెక్టు పోలవరం స్పీల్ వే తవ్వకాల్లో అద్భుతమైన శివలింగం బయటపడింది.
- By CS Rao Published Date - 06:39 PM, Sat - 21 May 22
జాతీయ ప్రాజెక్టు పోలవరం స్పీల్ వే తవ్వకాల్లో అద్భుతమైన శివలింగం బయటపడింది. గోదావరి నదీగర్భంలో శివలింగాన్ని గుర్తించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నదీగర్భంలో తవ్వాల్సిన స్పిల్వే పనుల్లో పాత పైడిపాక గ్రామంలో శివలింగాన్ని గుర్తించారు. సైట్లో పని చేస్తున్న కూలీలు శివలింగాన్ని చూసి అధికారులు సమాచారం అందించారు.
ప్రాజెక్టు అధికారులు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. దాని అసిస్టెంట్ డైరెక్టర్ కె తిమ్మరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని సాంకేతిక అధ్యయనాల తరువాత పురాతన శివలింగంగా తేల్చారు. దీనిపై ఉన్న కొన్ని సంకేతాల ఆధారంగా 1300-1200 BC నాటిదని గుర్తించారు. బహుశా 13 నుండి 12వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు.
ఈ విభాగం 1996-2003 మధ్య కాలంలో పురాతన ఇటుక నిర్మాణాలను కనుగొనడానికి పరిశోధన చేసింది. ఈ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలో అనేక వందల గ్రామాలు ఉండేవని, ఇక్కడి పురాతన దేవాలయాల్లో విగ్రహాలు దొరికాయని అధికారులు తెలిపారు. దాదాపు 370 గ్రామాల్లో సర్వేలో 570 విగ్రహాలు లభ్యమయ్యాయని వివరించారు. రామయ్యపేట గ్రామంలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రాజెక్ట్ సైట్ వద్ద వచ్చే మ్యూజియంలో ఆ లింగాన్ని ఉంచుతామని అధికారులు చెప్పారు.
సమీపంలోని గ్రామస్థులు శివుని దర్శనం కోసం ప్రదేశానికి తరలి రావడం ప్రారంభించారు. పూజలు మరియు హారతుల రూపంలో శివలింగాన్ని ఆరాధిస్తున్నారు. ఎన్నో శతాబ్దాల తర్వాత బయటపడిన శివలింగానికి ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ ‘శివనామ స్మరణసతో భక్తులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎలాగైనా అడ్డంకులను అధిగమించాలంటే దేవుడి ఆశీస్సులు కావాలి. ప్రస్తుతం బయటపడ్డ శివలింగం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Related News
AP : పోలింగ్ రోజున మీరు వేసే ఓటుకు జగన్ ప్యాలెస్ బద్ధలుకావాలి – చంద్రబాబు
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారని, Land Titling Act పేరుతో మీ భూములు కబ్జా చేయాలనీ చూస్తున్నారని ఆరోపించారు