Pawan Kalyan : టీడీపీ అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉంది – మంత్రి అంబటి
టీడీపీ చేసిన ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉందన్నారు. అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు
- By Sudheer Published Date - 02:01 PM, Sat - 7 October 23
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సంచలన ఆరోపణలు చేసారు. టీడీపీ (TDP) చేసిన ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉందన్నారు. అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను యావత్ ప్రజానీకం ఖండిస్తూ, ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. విదేశాల్లో సైతం బాబు తో మేము అంటూ నిరసనలు తెలుపుతూ..వైసీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి టీడీపీ కి మరింత బలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యల ఫై పోరాటం చేస్తున్నాయి. పవన్ పొత్తు ప్రకటించడం తో వైసీపీ నేతలు మరింత దూకుడు పెంచారు. పవన్ కళ్యాణ్ , చంద్రబాబుల ఫై ఆరోపణలు , విమర్శలు చేస్తూ నానా హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అంబటి..ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అవినీతిలో పవన్ కు భాగం ఉందని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ , జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.
ఇదే క్రమంలో మంత్రి అంబటి కృష్ణా జలాలపై కూడా స్పందించారు తన శాఖను గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని తెలిపారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటామని వెల్లడించారు. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోమని అన్నారు.
Read Also : Nitin Gadkari Biopic : 27న ‘గడ్కరీ’ బయోపిక్ రిలీజ్.. స్టోరీలో ఏముంది ?
Related News
AP Poll : వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న సర్వేలు..
ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెపుతుండడం తో వారిలో ఖంగారు మొదలవుతుంది