Amanchi Krishna Mohan : ఆమంచి దారెటు…?
- By Sudheer Published Date - 03:37 PM, Sat - 17 February 24
వైసీపీ ఏడో లిస్ట్ (YCP 7th List) శుక్రవారం రాత్రి విడుదలైంది..ఈ జాబితాలో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే వచ్చాయి. ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన జగన్..శుక్రవారం రాత్రి ఏడో జాబితాను రిలీజ్ చేసారు. ఈ ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించారు. పర్చూరు ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇన్ఛార్జ్ మహీధర్ రెడ్డిని ఇన్ఛార్జ్గా తప్పించింది. పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారు.
పర్చూరు ఇంచార్జ్గా ఎడం బాలాజీ అనే నేతను నియమించడం. ఆ నియామకం కాదు ఆశ్చర్యకరమైన విషయం.. ఆ నియోజకవర్గంలో బలమైన నేత ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) ను తప్పించడం .. ఆయనకు మరో నియోజకవర్గం చూపించకపోవడమే వైసీపీ వవర్గాను సైతం ఆశ్చర్య పరిచింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఆయనకు ఈ విషయంలో ముందే చెప్పారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు.
We’re now on WhatsApp. Click to Join.
చీరాలలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు పోటీ చేయడం ఇష్టం లేదు. గతంలో టీడీపీలో ఉండే ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన సంతోషంగా ఉండలేకపోయారు. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో జగన్ రెడ్డి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు. నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్నది ఆమంచికి చెప్పి.. .. పర్చూరుకు పంపారు. అక్కడ కుదురుకునే పరిస్థితి లేదని తేలడంతో ఆయన చీరాలపైనే దృష్టిపెట్టారు. వైసీపీ టిక్కెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు.. తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని డిసైడయ్యారని చెబుతున్నారు. ఇటీవల చీరాలలో ఆయన అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించారని అంటున్నారు. పర్చూరులోనే పోటీ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినకపోవడంతో సీఎం జగన్ కొత్త అభ్యర్థిని చూసుకున్నారని అంటున్నారు.
ఇటు చీరాల టికెట్ ఆయనకే ఇస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత. ఆయన చీరాల ఫలితాన్ని తేల్చగలరు. అలాంటి నేతను జగన్ వదులుకోరని చెపుతున్నారు. కానీ చీరాలలో కరణం బలరాం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేయాలనుకుంటున్నారు. వారిని కాదని ఆమంచికి జగన్ కు ఇస్తారా అన్న సందేహం మరికొందరిలో కలుగుతుంది. ఒక వేళ వైసీపీలో టిక్కెట్ రాకపోతే ఆమంచి జనసేన పార్టీలో అయినా చేరి పోటీ చేయాలనుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై జనసేన అధినేత తో చర్చలు కూడా జరిపారని వినికిడి. ఏది ఏమైనప్పటికి ఆమంచి విషయంలో త్వరగా ఏదోకటి తేలితే బాగుండని అయన వర్గీయులు అంటున్నారు.
Read Also : Ooru Peru Bhairavakona : ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ డే కలెక్షన్స్
Related News
YCP 7th List : వైసీపీ 7వ జాబితా విడుదల..
ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన జగన్..శుక్రవారం రాత్రి ఏడో జాబితాను రిలీజ్ చేసారు. ఈ ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత�