Nasa : నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం అదేనని వెల్లడి
నాసాకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది.
- By Hashtag U Published Date - 04:30 PM, Sun - 4 September 22
నాసాకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. రాకెట్లో ఇంధన లీకేజీని అరికట్టడంలో ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది.లాంఛ్ సిస్టమ్ రాకెట్లో ఇంధనం లీక్ అయినట్లు గుర్తించారు. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. రిహార్సల్స్ నిర్వహించగా ఆ సమయంలోనే ఇంధన లీకేజీ జరిగినట్లు తేల్చారు. దీంతో.. వాల్వ్లోనూ లీకేజీలు వచ్చాయి. నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు..లీకులు ఉండటంతో చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా వేసినట్లు సమాచారం. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనున్నదీ మాత్రం నాసా వెల్లడించాల్సి ఉంది. ఈ ప్రయోగం ఇప్పటికే గత నెల 29న వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంజిన్ నంబర్-3లో లీకేజీ సమస్య వల్ల రాకెట్ లాంఛ్ను అప్పట్లో వాయిదా వేశారు.
అపోలో ప్రాజెక్టు తర్వాత..
అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏళ్లకు మరోసారి చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించడమే ఈ 100 మీటర్ల ఆర్టెమిస్ ఉద్దేశ్యం. 1972లో ప్రాజెక్ట్ అపోలో ముగిసిన తర్వాత ఈ ప్రయత్నం జరగలేదు. ఆర్టెమిస్-1 కేవలం సాంకేతిక ప్రయోగం మాత్రమే. ఈ స్పేస్ క్యాప్సూల్లో మనుషులు ప్రయాణించరు. కానీ అన్నీ ఊహించినట్లుగా జరిగితే 2024లో ప్రయోగించనున్న ఆర్టెమిస్-2 చంద్రుని పైకి కచ్చితంగా వ్యోమగాములను తీసుకుని వెళుతుంది. కాగా ఆర్టెమిస్ ప్రయోగం పట్ల ప్రతిఒక్కరూ సహనం వహించాలని, ఒకవేళ ఈ ప్రయోగం మరింత వాయిదా పడినా కూడా ఆశ్చర్యపోవద్దని నాసా వ్యోమగామి జెస్సికా మైయర్ చెప్పారు
Tags
Related News
NASA : నాసా అవార్డులను గెలుచుకున్న భారతీయ విదార్థులు
NASA: అహ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అ�