Zoom Layoff : లే ఆఫ్ బాటలో “జూమ్” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?
సాఫ్టవేర్ రంగంలో ఉద్యోగుల తొలిగింపు ఆందోళన కలిగిస్తుంది. బడా టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల్ని భారీగా తొలిగిస్తున్నాయి.
- By Prasad Published Date - 08:38 AM, Wed - 8 February 23

సాఫ్టవేర్ రంగంలో ఉద్యోగుల తొలిగింపు ఆందోళన కలిగిస్తుంది. బడా టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల్ని భారీగా తొలిగిస్తున్నాయి. ఆమెజాన్, గూగుల్, డెల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఇప్పటికే వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కూడా లే ఆఫ్ బాట పట్టింది. తమ మొత్తం వర్క్ఫోర్స్లో 15 శాతం అంటే దాదాపు 1,300 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ బ్లాగ్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. సంస్థలోని ప్రతి విభాగంలోనూ ఉద్యోగుల కోత ఉంటుందని జూమ్ సీఈవో ఎరిక్ యాన్ తెలిపారు. నిర్ణయం కఠినమైనదే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని.. కష్టపడి పనిచేసే, నైపుణ్యం ఉన్న తమ సహచరులను తొలగించక తప్పడం లేదని చెప్పారు. తాను, ఇతర ఎగ్జిక్యూటివ్ల వేతనంలోనూ కోత ఉంటుందని ఈ సందర్భంగా ఎరిక్ పేర్కొన్నారు. కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉద్యోగుల తొలగింపునకు పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. మాటల్లోనే కాకుండా తనపై సొంతంగా చర్యలు తీసుకోవడం ద్వారా దానికి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనాన్ని 98 శాతం తగ్గించుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందం సభ్యులు కూడా తమ మూల వేతనాలను 20 శాతం తగ్గించుకుంటారని వివరించారు.

Related News

Google: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్… ఇండియాలో కొత్త ఉద్యోగాల ప్రకటన ఎప్పుడంటే?
వరుసగా ఉద్యోగులను తొలగిస్తూ సంచలనానికి తెరలేపిన గూగుల్ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ ఉద్యోగులను తీసుకుంటామంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.