Birds Suicides – A Village : పక్షులు సూసైడ్ చేసుకునే మిస్టరీ విలేజ్.. ఇండియాలోనే !
Birds Suicides - A Village : మనుషుల సూసైడ్స్ గురించి మనం నిత్యం వింటుంటాం.కానీ పక్షులు, జంతువులు ఎన్నడూ సూసైడ్స్ చేసుకోవు.
- By Pasha Published Date - 10:36 AM, Tue - 29 August 23
Birds Suicides – A Village : మనుషుల సూసైడ్స్ గురించి మనం నిత్యం వింటుంటాం.
కానీ పక్షులు, జంతువులు ఎన్నడూ సూసైడ్స్ చేసుకోవు.
వాటికీ ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి.. అయినా కడదాకా ధైర్యంతో పోరాడుతాయి.
ఇందుకు భిన్నంగా అస్సాంలోని ఓ గ్రామంలో పక్షులు కూడా సూసైడ్స్ చేసుకుంటున్నాయి.
ప్రతి ఏడాది ఆ 3 నెలల వ్యవధిలో.. రోజూ ఆ మూడున్నర గంటల వ్యవధిలో పక్షుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
Also read : Bhagavata – Miracle : భాగవత ప్రవచనం విన్న దొంగ.. యమునా తీరానికి వెళ్తే ఏమైందంటే..?
మనం ఇప్పుడు తెలుసుకోబోయే మిస్టీరియస్ ఊరి పేరు ‘జతింగా’ (jatinga). ఇది అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో ఏముందో తెలియదు కానీ.. ప్రతి ఏడాది సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ నెలల్లో రోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తూ సూసైడ్స్ కు పాల్పడుతుంటాయి. ఈ టైంలో జతింగా గ్రామంలోని పక్షులకు తల తిరిగినట్టు అవుతుంది. కళ్లు సరిగ్గా కనిపించవు. మైకం కమ్మేసినట్టు అవుతుంది. ఈక్రమంలో ఆ బర్డ్స్ వాటిపై అవి కంట్రోల్ ను కోల్పోయి.. స్థానికంగా ఉన్న చెట్లను, విద్యుత్ స్తంభాలను, విద్యుత్ వైర్లను, విద్యుత్ లైట్లను, ఇళ్లను ఢీకొని చనిపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. స్థానికుల్లో కొంతమంది ఈ ఊరిశివారులో దుష్టశక్తులు ఉన్నాయనే వదంతులను నమ్ముతుంటారు. ఇంకొందరు దుష్టశక్తులేం లేవని అంటుంటారు. జతింగా గ్రామంలో భూఅయస్కాంత క్షేత్ర ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తట్టుకోలేక పక్షులు నెగెటివ్ గా ప్రభావితమై చనిపోతున్నాయని మరికొందరు వాదిస్తున్నారు.
Also read : NTR Coin – Buy Now : ‘ఎన్టీఆర్ కాయిన్’ సేల్స్ నేటి నుంచే.. ఇలా కొనేయండి
జతింగా గ్రామానికి ఎవరో పెట్టిన శాపం వల్ల ఇలా జరుగుతోందని (Birds Suicides – A Village) పలువురు గ్రామస్తులు చెబుతుంటారు.దీనిపై ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగితే బాగుంటుందని జతింగా గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఊరిలో సూసైడ్స్ చేసుకుంటున్న పక్షుల లిస్టులో దాదాపు 40 రకాల పక్షిజాతులు ఉండటం గమనార్హం. కనీసం ఈ పక్షిజాతులను రక్షించేందుకైనా ఈ రీసెర్చ్ చేయడం అవసరమని స్థానికులు సూచిస్తున్నారు. టిబెట్, చైనా, థాయ్ లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడి వలస వచ్చే విదేశీ పక్షులు కూడా ఈ సూసైడ్స్ చేసుకుంటున్న లిస్టులో ఉన్నాయి. ఇలా సూసైడ్స్ కు పాల్పడుతున్న వలస పక్షులలో టైగర్ బిటర్న్, లిటిల్ ఎగ్రెట్, బ్లాక్ బిటర్న్, పాండ్ హెరాన్, ఇండియన్ పిట్టా, కింగ్ఫిషర్లు ఉన్నాయి. ఈ పక్షుల సూసైడ్ వ్యవహారం 1910లో మొదలైందని అంటారు. తొలుత 1957లో ఈ విషయం ప్రపంచానికి తెలిసిందని సమాచారం. అప్పట్లో బ్రిటిష్ పర్యావరణ ప్రేమికుడు, పక్షి శాస్త్రవేత్త EP Gee రాసిన పుస్తకం ‘వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో జతింగా గ్రామంలో పక్షులు సూసైడ్ చేసుకునే మిస్టరీ గురించి తొలిసారిగా ప్రస్తావించారు.
Tags
Related News
Traffic Signal For Camels : ఎడారిలో ట్రాఫిక్ సిగ్నల్.. ఎందుకో తెలుసా ?
Traffic Signal For Camels : చైనా కొన్ని వెరైటీ పనులు కూడా చేస్తుంటుంది.