బాలుడిని మింగేసిన మొసలి.. గ్రామస్తులు బంధించాక ఏం జరిగిందంటే..
పదేళ్ల బాలుడిని మొసలి మింగేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని షియోపూర్లో చోటుచేసుకుంది.
- By Hashtag U Published Date - 11:48 AM, Wed - 13 July 22
పదేళ్ల బాలుడిని మొసలి మింగేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని షియోపూర్లో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తున్న పదేళ్ల బాలుడిపై ఒక్కసారిగా భారీ మొసలి దాడి చేసింది. బాలుడిని నదిలోకి లాక్కెళ్లి మింగేసింది. అక్కడున్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కర్రలు, తాడు, వల సాయంతో మొసలిని నది నుంచి బయటకు లాగి బంధించారు. మొసళ్ల సంరక్ష విభాగం బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే బాలుడి కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో తమ బిడ్డ ఇంకా బతికే ఉంటుందని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. మొసలి తమ బిడ్డను బయటకు పంపిస్తేనే.. దాన్ని వదిలేస్తామని వారు తేల్చి చెప్పారు. పిల్లవాడు చనిపోయా డని.. మొసలి కడుపు నుంచి అతడు సజీవంగా బయటికి రావడం అసాధ్యమని పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్ష విభాగం సిబ్బంది నచ్చజెప్పారు. దీంతో విషయాన్ని అర్థం చేసుకున్న గ్రామస్థులు మొసలిని విడిచిపెట్టారు. ఆపై అధికారుల మొసలిని ఎట్టకేలకు నదిలోకి వదిలిపెట్టారు. బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళటంతో చిన్నారిని మొసలి మింగేసిందని రఘునాథ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Tags
Related News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది