KTR Exclusive: ‘కేఏ పాల్’ ను పోటీగా భావిస్తోన్న కేటీఆర్!
కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 12:25 PM, Mon - 25 April 22
కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే తొలి హ్యాట్రిక్ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలుస్తుందని ఆయన అన్నారు. “కేసీఆర్ సంస్కర్త, తెలంగాణ సాధకుడు. ప్రత్యేక రాష్ట్రంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నిర్మించడం, రైతులకు 24×7 విద్యుత్ అందించడంలో చరిత్రను తిరగరాసిన నాయకుడు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “నరేంద్ర మోదీ ప్రభుత్వంలా” ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి రాష్ట్ర సంస్థలను ఉపయోగించని కె చంద్రశేఖర్రావు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వమని కేటీఆర్ ప్రకటించారు. “మాది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వమని, అయితే గవర్నర్ రాజ్భవన్ను రాజకీయాల భవన్గా మార్చారని ఆయన అన్నారు. జిల్లాలకు వెళ్లేందుకు తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ను అందించకపోవడంపై రియాక్ట్ అవుతూ “రోడ్డు మార్గంలో వెళ్లడంలో తప్పేముంది? ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి మాదిరిగానే రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. నేను నిత్యం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తా. ఆమె పదవి గవర్నర్ పదవి అని, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కాదని తమిళిసై గుర్తుంచుకోవాలి‘‘ కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. ‘అదొక సచ్చిన పాము’ అని కేటీఆర్ అన్నారు. “కాంగ్రెస్ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు 10 మంది సీనియర్లలో ఎనిమిది మంది హాజరుకావడం లేదు” అంటూ సెటైర్స్ వేశారు. ఇటీవల ప్రధానిపై ట్వీట్ చేసినందుకు జిగ్నేష్ మేవానీ అరెస్ట్ చేసినట్టుగానే.. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా బీజేపీ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మోడీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తగా ఉండకూడదని, దేశ ప్రధానిగా మాట్లాడాలని ఆయన తేల్చి చెప్పారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ (ధర్మపురి అరవింద్) హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాడనీ, అదే విధంగా కరీంనగర్కు కేంద్ర నిధులు తీసుకురాలేకపోయిన ఎంపీ బండి సంజయ్ పట్ల వ్యతిరేకత ఎదురవుతుందని కేటీఆర్ అన్నారు.
ఇటీవల టీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చిన నేరాలపై కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘‘మేం ఎవరికీ రక్షణ కల్పించడం లేదు.. నిజానికి పోలీసులను వారి పని వారు చేసుకుంటున్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అరెస్ట్. తల్లి, రియల్టర్ కుమారుడి ఆత్మహత్యలో అతని పాత్ర నిరూపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్యకు స్థానిక బిజెపి నేతలే కారణమని, గణేష్కు పురుగుమందు బాటిల్ అందించిన బిజెపి నాయకుడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరామని అన్నారు. కాషాయ పార్టీ నేతలు యువతను రెచ్చగొట్టి విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. లఖింపూర్ కేసులో ఒక మంత్రి కొడుకు ఎనిమిది మందిని ఢీకొట్టిన కేసులో ప్రధాని మోడీ స్పందించకపోవడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏనాడూ సాయం చేయలేదు. మన గాయాలకు ఉప్పు రుద్ది కర్నాటకలోని ఎగువ భద్రకు కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిందని, తెలంగాణలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా అలాంటి హోదా ఇవ్వలేకపోయిందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికల గురించి అడగ్గా, 2023లో ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు. ఎన్నికలు ఏ నెలలో జరుగుతాయని అడిగిన ప్రశ్నకు “నేను జ్యోతిష్యుడిని లేదా పండితుడిని కాదు. తేదీలు నిర్ణయించేది భారత ఎన్నికల సంఘం అని కేటీఆర్ నవ్వులు పూయించారు. టీఆర్ఎస్కు ప్రజాభిమానం ఎక్కువగా ఉందని, పార్టీ పునాది చెక్కుచెదరలేదని, రాజీలేని రీతిలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తూ తెలంగాణ కోసం ఏకైక గొంతుక టీఆర్ఎస్ అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్పై ప్రధాన ప్రతిపక్షం ఏంటని ప్రశ్నించగా.. గులాబీ పార్టీకి గట్టి వ్యతిరేకత లేదని కేటీఆర్ నవ్వేశారు. మా ప్రధాన ప్రత్యర్థి కేఏ పాల్, వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు’’ అని అన్నారు. వచ్చే నెలలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశంపై కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు. ముందుగా తన సొంత లోక్సభ (అమేథీ) స్థానంలో గెలుపొందాలని రాహుల్ కు సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల కంటే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులే ఎక్కువని రాష్ట్ర బీజేపీ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల బీజేపీ నేతలు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారు.’’ అని కేటీఆర్ అన్నారు.
Related News
POWERHOUSE Interview : మరో ‘పవర్’ ను ఇంటర్వ్యూ చేయబోతున్న TV9 రజనీకాంత్
రీసెంట్ గా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలువగా..ఇప్పుడు మరో వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు