TRS Decide: దీదీ ‘విపక్షాల’ భేటీకి టీఆర్ఎస్ డుమ్మా!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని విపక్షాల సమావేశంలో పాల్గొనకూడదని (టీఆర్ఎస్) నిర్ణయించింది.
- By Balu J Published Date - 12:47 PM, Wed - 15 June 22
ఇవాళ రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని విపక్షాల సమావేశం జరుగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మమతా బెనర్జీ కాంగ్రెస్కు కూడా ఆహ్వానం పంపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్తో కలిసి వేదికను పంచుకోవడం టీఆర్ఎస్కు ఇష్టం లేకపోవడంతో సభను బహిష్కరించాలని నిర్ణయించింది. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య దూరం పాటించాలని టీఆర్ఎస్ గతంలోనే స్పష్టం చేసింది. ఈ సమావేశాన్ని బహిష్కరించాలని పార్టీ నిర్ణయించినప్పటికీ, రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం లేదని సమాచారం.
మాజీ మంత్రి హెచ్.డి. దేవెగౌడ, ఆయన కుమారుడు, జనతాదళ్ (ఎస్) నాయకుడు హెచ్.డి. కుమారస్వామి, రాష్ట్రీయ లోక్దళ్కు చెందిన జయంత్ చౌదరి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఎంకే స్టాలిన్కు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తరపున టీ. ఆర్. బాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హాజరుకానున్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే సమావేశంలో కాంగ్రెస్ కూడా పాల్గొంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సూర్జేవాలా సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
మాజీ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్కు కూడా బెనర్జీ ఆహ్వానం పంపారు. అయితే సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. కాగా ఈ భేటీకి వామపక్షాలు హాజరయ్యే అవకాశం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా మంగళవారం తెలిపారు. ఆహ్వానం పొందిన నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. మమతా గతంలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 22 మంది నేతలకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనుండగా.. జూలై 21న ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు ఒకరు లేదా ఇద్దరైనా విపక్షాల భేటీకి హాజరవుతారని భావించారు. కానీ కాంగ్రెస్ కూడా పాల్గొంటుండటంతో టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది.
Related News
Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.