BJP Vs TRS : వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కేసీఆర్
`వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డాడు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాలని కోరాడు. దేశ భక్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుకలు కోసే దమ్ము దైర్యం ఉందా? అంటూ నిలదీశాడు.
- By CS Rao Published Date - 02:50 PM, Mon - 8 November 21
`వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డాడు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాలని కోరాడు. దేశ భక్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుకలు కోసే దమ్ము దైర్యం ఉందా? అంటూ నిలదీశాడు. సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్న తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ దుయ్యబట్టాడు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో చెప్పాలని కోరాడు. మందుకు ఇచ్చినంత విలువ తెలంగాణకు ఇవ్వనటువంటి పచ్చి దగాకోరుగా కేసీఆర్ ను అభివర్ణించాడు.
కేసీఆర్ చెప్పిన అబద్దాలపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ ఆంటూ చిట్టాను విప్పాడు. వరి పంట విషయంలో కేంద్రం కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీని బయటపెట్టాడు. ఉప్పుడు బియ్యం మాత్రమే కొనుగోలు చేయమని కేంద్రం చెప్పిందని, వరి పంటను కొనుగోలు చేయమని ఎక్కడ చెప్పారో తేల్చాలని నిలదీశాడు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏడాదిదికి ఎంత నిధులను ఇచ్చారో బండి బయటపెట్టాడు. డీజిల్, పెట్రోలుపై వ్యాట్ ను 2015లో పెంచుతూ జారీ చేసిన జీవోను బండి విడుదల చేశాడు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టాడు. కృష్ణా నది జలాలపై కేసీఆర్ చేసిన మోసాన్ని బండి వివరించాడు.
Also Read : కేసీఆర్ జైలు..బండి నాలుక కోత..తెలంగాణలో పొలిటికల్ హీట్
తెలంగాణకు రావాల్సిన వాటాను రాబట్టుకోకుండా కేవలం 299టీఎంసీల నీటి వాటాకు అంగీకరిస్తూ కేసీఆర్ చేసిన సంతకంపై మండపడ్డాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చుతానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అన్నీ అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డాడు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టాడు. రైతులను మోసం చేయకుండా వరి పంటను కొనుగోలు చేయాలని కేసీఆర్ కు హితవు పలికాడు.
తెలంగాణ కోసం చేసిన దొంగదీక్ష గురించి బండి ప్రస్తావించాడు. ఆనాడు లిక్విడ్ ప్లూయిడ్ ను తీసుకున్న తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ధ్వజం మెత్తాడు.
- రైతులకు రుణమాఫీ చేశావా? చేయలేదా? చెప్పాలని కేసీఆర్ కు సవాల్
- కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఉపాథి హామీ కోసం హైద్రాబాద్ వీడుతోన్న యువత
- రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ జిల్లా సిద్దపేటలో అత్యధికం
- బాయిల్డ్ రైస్ కొనుగోలు లేదని కేంద్రం చెప్పింది. వరి పంటను కొనుగోలు చేయమని కేంద్రం జీవో ఇచ్చింది
- 62 లక్షల ఎకరాల్లో వరి పంటను తెలంగాణలో పండించారని కేసీఆర్ నిరూపించాలి
- చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజీనామా చేయాలి
- కృష్ణా నది జలాల వాటా విషయంలో 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది.
- నాలుక కోసే దమ్ము ఉంటే రావాలి. మూర్ఖుడిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు.
- పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను పెంచుతూ 2015లో కేసీఆర్ జీవో ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యాట్ ను తగ్గించాలి
- తెలంగాణ ఉద్యమం అంటూ దొంగదీక్ష చేసిన కేసీఆర్. పార్లమెంట్లో బిల్లు ఆమోదం సమయంలో కేసీఆర్ ఎక్కడ?
- ఎంఐఎం మిత్రపక్షం అని చెబుతోన్న కేసీఆర్ కు దేశభక్తి లేదన్న బండి
- కేసీఆర్ చెప్పిన అబద్దాలు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. అన్నీ అబద్దాలు చెబుతున్నాడని బండి ఆరోపణ
- వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గుగూల్ లో కొడితే కేసీఆర్ ఎంటో తెలుస్తుందని బండి
- రైతుల చట్టాలు మీద కేసీఆర్ రోజుకో రకంగా కేసీఆర్ మాటలు
Related News
Bandi Sanjay: బతుకమ్మ చీరల బకాయిలు ₹270 కోట్లు చెల్లించాలి: బండి సంజయ్
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక, ఇటు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో వారి భౌతికదేహానికి నివాళులర్పించి, లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తన కుమారుడ�