Indira Shoban: ఢిల్లీ పీఠాన్నే గెలిచినోళ్లం.. ఇక గల్లిలో గెలవలేమా?
ఇందిరా శోభన్.. తెలుగు రాష్ట్ర రాజకీయాలకు చాలా సుపరితం. మొదట్లో ఆమె తెలంగాణ జాగృతి ప్రధాన నాయకురాలిగా పనిచేశారు. అక్కడ విభేదాలు రావడంతో ప్రత్యేక రాష్ట్రం సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం
- By Balu J Published Date - 04:39 PM, Sat - 12 February 22
ఇందిరా శోభన్.. తెలుగు రాష్ట్ర రాజకీయాలకు ఆమె సుపరితం. మొదట్లో ఆమె తెలంగాణ జాగృతి ప్రధాన నాయకురాలిగా పనిచేశారు. అక్కడ విభేదాలు రావడంతో ప్రత్యేక రాష్ట్రం సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం, సరైన గుర్తింపు ఇవ్వకపోడంతో వైఎస్ ఆర్ టీపీలో చేరారు. అందులోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఆమ్ ఆద్మీ బాట పట్టారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఇందిరా శోభన్ తెలంగాణ ఆమ్ పార్టీ ప్రభావం ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? థర్డ్ ఫ్రంట్ లో కేజ్రీవాల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? లాంటి ఆసక్తికర విషయాలతో కూడిన ఇంటర్వ్యూను ‘హ్యాష్ ట్యాగ్ యు’ ఇచ్చారు. ఆ విశేషాలే ఇవీ..
మీరు తిరిగి కాంగ్రెస్ లో చేరకుండా, ఆమ్ ఆద్మీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు?
కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన పార్టీగా ముద్ర పడింది. కేవలం ఆ వర్గాలవాళ్లను మాత్రమే ప్రోత్సహిస్తోంది. అక్కడ కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు. రాష్ట్ర నాయకత్వ కూర్పు కూడా సరిగ్గా లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరు ఉన్నందునే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితులను చూసి, అందులో చేరడానికి మనసు అంగీకరించలేదు. కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై.. ఆమ్ ఆద్మీ లో చేరా. కేజ్రీవాల్ విజన్ ఉన్న వ్యక్తి. ఢిల్లీలో చేసిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ కనిపించడం లేదు. అందుకే అలాంటి పార్టీలో చేరినందుకు గర్వపడుతున్నా!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఆమ్ ఆద్మీ పార్టీ.. ఎన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుంటుంది?
పంజాబ్, గోవా రాష్ట్రాల్లో కచ్చితంగా ఆమ్ ఆద్మీ అధికారంలోకి వస్తుంది. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆ రాష్ట్రాలవాళ్లు కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ సేట్స్ లోనూ గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా సింగిల్ మెజార్టీతో ఆమ్ ఆద్మీ గెలవబోతోంది! ఢిల్లీలో గెలిచినట్టుగానే తెలంగాణలోనూ సేమ్ సీన్ రిపీట్ కాబోతోంది. ఆమ్ పార్టీ నీతి, నిజాయతీ ఉన్న పార్టీ. ఇన్నాళ్లు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అవినీతి రాజకీయాలు, మోసపూరిత విధానాలను వ్యతిరేకించే ఊడ్చే పార్టీగా నిలుస్తుంది. ఒకవేళ ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తే పీఎం అభ్యర్థి కేజ్రీవాల్ కే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశ ప్రజలు కేజ్రీవాల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
సరైన గుర్తింపు ఇవ్వనందుకే కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ నుంచి బయటకొచ్చారా?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా నేను బాధపడలేదు. ఎమ్మెల్సీ టికెట్ చిన్నారెడ్డికి ఇచ్చిన సమయంలో, నామినేషన్ వేసిన సమయంలోనూ పక్కనే ఉన్నాను. ఆ తర్వాత రోజు నుంచి నా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో డిబేట్స్ చేశా. పోరాటాలు చేశా. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదని నన్నుదూరం చేశారు. ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ కు ఒరిగేందిమీ లేదు. దొందు దొందే! అయితే కొత్త పార్టీ వైఎస్ ఆర్ టీపీ లో షర్మిల మాత్రమే కష్టపడుతున్నారు. ఆమెను అనుచరవర్గం దారి మళ్లిస్తున్నారు. ఆ పరిస్థితుల కారణంగానే బయటకు రావాల్సి వచ్చింది. కార్యకర్తలు కూడా ఆ పార్టీకి దూరమమవుతున్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమె పార్టీ పెట్టినందుకే చేరాను తప్ప, నా స్వలాభం కోసం వెళ్లలేదు.
పాలిటిక్స్ అంటేనే డబ్బు. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన ఫండింగ్ లేదుకదా?
ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలే డబ్బలు ఇస్తారు. ఓటేస్తారు. అధికారం కూడా కట్టబెడతారు. మా పార్టీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 18 నుంచి 30 వయసు గల యువకులు కొత్త ఓటర్లుగా పుట్టుకొచ్చార. వాళ్లంతా ఆమ్ కే మొగ్గుచూపుతున్నారు. అదే విశ్వాసంతో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 300 కోట్లు ఖర్చు పెట్టినా అధికారపార్టీని జనాలు ఎలా తిరస్కరించారో, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సాగనంపుతారు. ఈ మూడు పార్టీ అవినీతే పార్టీలు. డబ్బు లేకుండా గెలవచ్చని హుజురాబాద్ ప్రజలు నిరూపించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అదే విశ్వాసంతో మేము కూడా ముందుకు వెళ్తాం.
కేసీఆర్, కేజ్రీతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తే.. కేజ్రీవాల్ ను సమర్థిస్తారా?
అధిష్టానం కోరిక మేరకు.. ఆ సమయం, సందర్భాన్ని బట్టి ఆలోచిస్తాం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అంత త్వరగా కేసీఆర్ ను నమ్మరు. కేజ్రీవాల్ కాకుండే దేశవ్యాప్తంగా ఏ నాయకులూ కూడా కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. ఆ విషయం కేసీఆర్ కు స్పష్టంగా తెలుసు. ఎన్నికల్లో గెలవడం భాగంగానే కేసీఆర్ ఎత్తుగడలు వేస్తుంటారు. కేజ్రీవాల్ అనుకుంటే ఏ పార్టీతో పొత్తులు లేకుండా ముందుకువెళ్తారు. ఢిల్లీ గెలిచినోళ్లం.. గల్లిలో గెలవలేమా? అప్పుడు సమయం, సందర్భాన్ని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం.
ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?
కేవలం తెలంగాణ సెంటిమెంట్ అడ్డంపెట్టుకొని కేసీఆర్ సీఎం అయ్యారు. పూటకో మాటకు మార్చే రకం. ఊసరవెల్లి కన్నా ఆయన హీనం. అవసరం కోసమే కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్నారు. అవసరం తీరాక కాంగ్రెస్ ను దూరం పెట్టారు. ఆ తర్వాత మోడీ సపోర్ట్ కోసం బీజేపీ పాట పాడారు. తాజాగా ఆ పార్టీతోనూ విభేధాలు రావడంతో మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ మెగా, రామేశ్వర్ లాంటివాళ్లు ధనవంతులయితే.. అక్కడ అదానీ, అంబానీలకు పెద్ద పీట వేశారు.
భవిష్యత్తులోనేనైనా ఆమ్ ఆద్మీలో ఉంటారా.. పార్టీ మారుతారా?
నేను ఇతర పార్టీల చేరదాల్చుకుంటే మూడు ప్రముఖమైన పార్టీల్లోకి వెళ్లేదాన్న. కానీ స్వార్థ రాజకీయాలను, అవినీతి రాజకీయాలు సహించలేకే ఆమ్ ఆద్మీలో చేరాను. ఆమ్ లో ఉంటాను. కేజ్రీవాల్ డైరెక్షన్ లోనే నడుస్తాను. నాకు ఎలాంటి పదవులు అవసరం లేదు.
కేసీఆర్ మోదీపై పరుష పదజాలం ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్?
ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం తగదు. ఈ సందర్భంగా బండి సంజయ్ గారిని ఒక్కటే కోరుతున్నా. ‘‘మీరు పదే పదే చెప్పినట్టే, మీ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే కేసీఆర్ ను జైలుకు పంపండి. మేం కేసీఆర్ జైల్లో పెట్టామని ప్రజలకు చెప్పండి. అప్పుడే మీ పట్ల విశ్వాసం ఉంటుంది’’ యువతకు మేల్కొని మంచి పార్టీలకు అధికారం ఇవ్వాలని మీ ‘హ్యాష్ ట్యాగ్ యూ’ ద్వారా కోరుకుంటున్నా. థాంక్యూ!!
ఇంటర్వ్యూ : రాజు రాథోడ్
Related News
POWERHOUSE Interview : మరో ‘పవర్’ ను ఇంటర్వ్యూ చేయబోతున్న TV9 రజనీకాంత్
రీసెంట్ గా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలువగా..ఇప్పుడు మరో వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు