AAP Contest: కేసీఆర్ ను ‘కేజ్రీ’ ఢీకొట్టేనా..?
తెలంగాణ రాజకీయ రంగం మరింత ఆసక్తికరంగా మారనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్
- By Balu J Published Date - 05:54 PM, Mon - 21 February 22
తెలంగాణ రాజకీయ రంగం మరింత ఆసక్తికరంగా మారనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పట్టు సాధించాలనుకుంటోంది. పార్టీ ఇటీవల బూత్ స్థాయి కమిటీలను నియమించడం, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తులను గుర్తించడం ప్రారంభించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన రోజుల్లో మొదట్లో సభ్యులుగా ఉన్న కొంతమంది మాజీ IAS అధికారులు, మేధావులు తప్ప పార్టీకి ఇక్కడ బలమైన సంబంధం లేదు. ఈసారి తెలంగాణలోని 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ చాపకింద నీరులా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. మొదట్లో ఢిల్లీకే పరిమితమైన ఆప్ ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర రాష్ట్రాలకు పాకింది. పంజాబ్ లాంటి బలమైన రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ… అధికార పార్టీకి ప్రత్యర్థిగా మారింది. అక్కడ బలమైన అభ్యర్థులను దింపితే, ఇప్పుడు కాకపోయినా.. మున్ముందు జెండా ఎగురవేసే స్పష్టంగా ఉన్నాయి. అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ చూపు తెలంగాణపై పడింది. అందుకనుగుణంగా ఇక్కడ కొంతమంది నాయకులకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Related News
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.