HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rti War Toddy Tappers Corp Not Paid Finds Sanjay Bandi

BJP RTI WAR: కేసీఆర్ స‌ర్కార్ పై బీజేపీ `ఆర్టీఐ` వార్

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆర్డీఐ ద్వారా సేక‌రించిన స‌మాధానాల‌తో యుద్ధం చేయాల‌ని బీజేపీ సిద్ధం అయింది.

  • By CS Rao Published Date - 03:45 PM, Tue - 2 August 22
  • daily-hunt
Telangana BJP
Sanjay bandi

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆర్డీఐ ద్వారా సేక‌రించిన స‌మాధానాల‌తో యుద్ధం చేయాల‌ని బీజేపీ సిద్ధం అయింది. ఆ మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇటీవ‌ల ఆర్టీఐకి వేసిన ప్ర‌శ్న‌ల‌కు వ‌చ్చిన స‌మాధాల‌ను వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014-15 నుంచి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి మంజూరు చేసిన నిధుల్లో నాలుగో వంతు మాత్రమే పంపిణీ చేసిందని సంజయ్ ఆర్టీఐ ప్రశ్నకు వ‌చ్చిన స‌మాధానాన్ని వెల్లడించారు.

జూలై మొదటి వారంలో వివిధ ప్రభుత్వ శాఖలు , రాష్ట్ర ప్రాయోజిత లేదా తెలంగాణ టోడీ టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (TTTCFC) వంటి యాజమాన్య సంస్థలకు దాదాపు 100 RTI ప్రశ్నలను దాఖలు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. RTI ప్రత్యుత్తరాలతో పకడ్బందీగా టిఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై యుద్ధం చేయాల‌ని బీజేపీ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగా జిల్లా, మండల స్థాయిలలో ఇలాంటి RTI ప్రశ్నలను దాఖలు చేయాలని పార్టీ నాయకులందరినీ కోరారు. ఖర్చు చేసిన సొమ్ముకు సంబంధించి 2014-15 నుంచి 2021-22 మధ్య ప్రభుత్వం రూ.76.30 కోట్లు మంజూరు చేసిందని, అయితే వాస్తవంగా రూ.24.83 కోట్లు మాత్రమే విడుదలైందని టీటీటీసీఎఫ్‌సీ తెలిపింది. ఆ సొమ్ములో కార్పొరేషన్ రూ.18.79 కోట్లు ఖర్చు చేసిందని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. 2018-19లో మంజూరైన రూ.65 కోట్లలో చివరిసారిగా రూ.21.54 కోట్లు వచ్చాయి. కార్పొరేషన్ దాదాపు రూ.15.50 కోట్లు వినియోగించింది. గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 2015-16, 2017-18, 2018-19లో మూడుసార్లు మాత్రమే నిధులు విడుదల చేసింది. ప్ర‌స్తుతం ఆర్టీఐ యుద్ధం ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంద‌ని, రాబోవు రోజుల్లో ఇలాంటి వార్ మ‌రింత వేగంగా ఉంటుందని బండి వెల్ల‌డించారు.

Also Read:  AP & TS Likely Sri Lanka: ఏపీ, తెలంగాణాల్లో శ్రీలంక `బూచి`


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Sanjay Bandi
  • Telangana BJP
  • Toddy tappers corp
  • TRS government

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd