Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ ప్రమాదం.. పలు కార్లు ధ్వంసం!
శనివారం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాన్వాయ్ ను ఫాలో అవుతున్న పలు కార్లు ప్రమాదానికి గురయ్యాయి.
- By Balu J Published Date - 11:45 AM, Sat - 4 March 23

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. శనివారం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాన్వాయ్ ను ఫాలో అవుతున్న పలు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమవ్వగా.. పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు సమాచారం. అయితే గట్టిగా ఢీకొనడంతో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పెను ప్రమాదం తప్పినట్లైంది.
పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగ్గపోవడంతో సెక్యూరిటీ (Sucurity) సిబ్బంది ఊపీరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తన పాదయాత్రకు ప్రభుత్వపరంగా సెక్యురిటీ పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

Related News

KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వారం రోజులే గడువు..!
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసును మంగళవారం అందజేశారు.