Revanth To KCR: కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి సంబందించిన ఎక్సైజ్ శాఖకి సంబందించిన విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
- By Hashtag U Published Date - 02:05 PM, Sun - 19 December 21
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి సంబందించిన ఎక్సైజ్ శాఖకి సంబందించిన విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎక్సైజ్ శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికార్లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని రేవంత్ కోరారు.
ఆంధ్ర నుండి తెలంగాణాకు కేటాయించిన తెలంగాణా బిడ్డలైన ముగ్గురు ఎక్సైజ్ సూపెరింటెండెంట్స్ ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రేవంత్ విన్నవించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అన్ని శాఖలతో పాటు ఎక్సైజు శాఖలో 64 ఉన్నతాధికార్లకు పదోన్నతి ఇచ్చి అందులో 12 మంది అధికార్లకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా అధికార్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అదే స్థానాలలో కొనసాగించుతున్నారు. ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు ఇవ్వకుండా అప్పు తీసుకొని బ్రతకమంటున్నారని ఇది దారుణమని రేవంత్ తెలిపారు.
ఈ విషయంపై ఎక్సైజు శాఖకు బాధ్యుడిగా ఉన్న సోమేష్ కుమార్ మరియు సంబంధిత మినిస్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని వీరికి రావలిసిన పీఆర్సీ ఇంక్రిమెంట్స్ మరియు ప్రీమియం చెల్లించక ఆరోగ్య సేవలు నిలిచిపోయినవి. ఎక్సైజు లాంటి నేరాలను అదుపు చేసే శాఖలలో 20% అధికార్లను వెయిటింగ్ లో పెట్టి పని చేస్తున్న అధికారులకే నాలుగు అయిదు అదనపు భాద్యతలు అప్పగించడం వలన నేరాలు అదుపు లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని రేవంత్ తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులు మరియు సర్క్యూలర్ల ప్రకారం ఉద్యోగిని వెయిటింగ్ లో పెట్టరాదని, రిపోర్ట్ చేసిన పది రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని, వెయిటింగులో పెట్టినట్లు అయితే సంబంధిత అధికారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారి జీతం నుండి వెయిటింగ్ అధికారుల జీత భత్యాలు రికవరీ చెయ్యాలని ప్రభుత్వ ఉత్తర్వులు తెలియ చేస్తున్నాయని రేవంత్ తెలిపారు.
Related News
TS : హరీశ్ రావు-రేవంత్ రెడ్డిల విద్యుత్ కోతల వివాదం
Power cuts controversy:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కోతల(Power cuts) విషయంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు గుప్పించారు. అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు పన్నుతారనే భ్రమల్లోనే రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించాలని అన్నారు. విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగ