KTR: రాహుల్ జీ కాళేశ్వరంను సందర్శించండి, పసలేని విమర్శలు మానుకోండి: కేటీఆర్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి.
- By Balu J Published Date - 05:45 PM, Thu - 19 October 23
KTR: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు సెటైర్స్ వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
‘‘రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే.. అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి. నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే… ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి. పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి’’ కేటీఆర్ సెటైర్స్ వేశారు.
‘‘మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి. కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడండి… చూసి నేర్చుకోండి. అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో.. అన్నదాతను అరిగోస పెట్టినందుకు.. సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు.. తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి. 80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో.. లక్ష కోట్ల అవినీతి అని.. అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండి. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి..సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండి’’ అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
Also Read: Jr NTR: జయహో జూనియర్, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో ఎన్టీఆర్ కు సభ్యత్వం
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �