AP – TS Poll : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ముగిసిన పోలింగ్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ , పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకు పోలింగ్ పూర్తయింది
- By Sudheer Published Date - 04:33 PM, Mon - 13 May 24
![AP – TS Poll : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ముగిసిన పోలింగ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Polling-ends-in-Maoist-affe.jpg)
తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తి అయ్యింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం..ఈ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ , పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకు పోలింగ్ పూర్తయింది. అలాగే.. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి… మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు.. అటు ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. అత్యంత పటిష్ట భద్రత మధ్య పోలింగ్ సామగ్రిని తరలించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also : AP Poll : గన్నవరంలో హై టెన్షన్..వంశీ, యార్లగడ్డ వర్గీయుల మధ్య ఘర్షణ
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Lok Sabha Speaker: ఎన్డీయే కూటమిలోని టీడీపీ.. లోక్సభ స్పీకర్ పదవి ఎందుకు అడుగుతుందంటే..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Lok-Sabha-Secretariat.jpeg)
Lok Sabha Speaker: ఎన్డీయే కూటమిలోని టీడీపీ.. లోక్సభ స్పీకర్ పదవి ఎందుకు అడుగుతుందంటే..?
Lok Sabha Speaker: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూల ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇప్పుడు ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలను కోరడానికి కారణం ఇదే. ఆరు పెద్ద మంత్రిత్వ శాఖల డిమాండ్ను ఎన్డీయే ముందు ఉంచినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కూడా లోక్సభ స్పీకర్ పదవి (Lok Sabha Speaker)ని కోరుతోంది. ప్రతి విషయంలోనూ టీడీపీ వై