Political Thriller: ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ చిత్రాలు, పొలిటికల్ మైలేజ్ కోసం బిగ్ స్కెచ్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.
- By Balu J Published Date - 12:12 PM, Fri - 20 October 23
Political Thriller: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయానికి తమ సినిమాలు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఎన్నికల సీజన్లో మూడు సినిమాలు విడుదల అయ్యేందుకు రెడీగా ఉన్నారు. నవంబర్లో విడుదల కానున్న సినిమాలు ప్రజలను అలరించడమే కాకుండా, చర్చలను ప్రేరేపించి, ఇతరులను ప్రభావితం చేసేలా ఉండబోతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఒకటి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జీవితం ఆధారంగా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు. తన రాజకీయ ఎత్తుగడలను ఎలా ప్లాన్ చేసుకుంటాడో, అలాగే TDp అధినేత N. చంద్రబాబు నాయుడుని ఫెయిల్యూర్గా చిత్రీకరించే జీవిత చరిత్ర సినిమా ఇది.
మరో సినిమాని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ నిర్మిస్తున్నారు. “ఈ చిత్రం సనాతన ధర్మం, మతం, కరోనావైరస్, బిజెపి రాజకీయాలు వంటి ఇతివృత్తాల ఆధారంగా తెరకెక్కుతుంది” అని దయాకర్ అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండబోతుంది. కలిగి ఉంటుందని. ప్రజలలో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది.
తెలంగాణా బిజెపి నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన మూడవ చిత్రం. రజాకార్ల దురాగతాలపై దృష్టి సారించి, వారితో పోరాడడంలో ప్రజల దృఢ సంకల్పాన్ని హైలైట్ చేస్తుంది. చారిత్రత్మక నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ బీజేపీ మైలేజ్ కోసమే విడుదల అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఆర్జీవీ సినిమా చంద్రబాబు నాయుడుని విమర్శనాత్మకంగా చిత్రీకరించడం వల్ల జగన్ మోహన్ రెడ్డికి హెల్ప్ కావచ్చు అని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సినిమాపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇప్పటికే కేసీఆర్ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.
Related News
KCR: కాంగ్రెస్ వ్యతిరేక చర్యలపై కేసీఆర్ ఫైర్..
KCR: రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు, (గురువారం.,16.05.24)రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్�