Viral : ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందేస్తూ చిందేసిన ప్రయాణికులు..
- By Sudheer Published Date - 01:26 PM, Sat - 24 February 24
TSRTC బస్సులో ఏకంగా మద్యం తాగుతూ చిందులేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక మేడారం జాతర కు వెళ్లే బుస్సులోను ఫ్రీ అమలు చేయడం తో గతంతో కంటే ఈసారి మహిళలు పెద్ద ఎత్తున మేడారం కు వెళ్లడం జరిగింది. కాగా మేడారం జాతరకు వెళ్లే బస్సులో కొంతమంది ప్రయాణికులు మద్యం తాగుతూ కనిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబదించిన వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చుట్టూ మహిళా ప్రయాణికులు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా వైన్ షాప్ లో ఎలాగైతే మద్యం సేవిస్తారో అలా..ప్రభుత్వ బస్సు లో మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేసారు. మరి ఇంత జరుగుతున్న సదరు డ్రైవర్ కానీ , కండక్టర్ కానీ పట్టించుకోలేదా అనేది అర్ధం కావడం లేదు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.
సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు. pic.twitter.com/bIq3d1ElVz
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2024
Read Also : Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?
Tags
Related News
TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్ఆర్టీసీ క్లారిటీ
TSRTC: వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోల�