Puvvada Ajay : పువ్వాడ అజయ్కు బిగుస్తున్న ఉచ్చు.. ఆ కేసులో ప్రమేయంపై!
బీజేపీ కార్యకర్త సామినేని సాయి ఆత్మహత్య తెలంగాణలో కలకలం రేపుతుంది. బుధవారం నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.. మరోవైపు సాయి కేసులో ఏ-1 ముద్దాయి పువ్వాడ అజయ్ అని..
- By Hashtag U Published Date - 07:48 AM, Wed - 20 April 22
బీజేపీ కార్యకర్త సామినేని సాయి ఆత్మహత్య తెలంగాణలో కలకలం రేపుతుంది. బుధవారం నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.. మరోవైపు సాయి కేసులో ఏ-1గా పువ్వాడ అజయ్ ను కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ప్రశ్నించింది.
సామినేని సాయి ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ ను నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయన్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబంధం లేదా అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో ఏసీపీ కూడా నిందితుడేనన్నారు. రజాకార్లను ఎదిరించిన చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసులు, సర్కార్ కు తొత్తులుగా బతికే పరిస్థితికి దిగజారారని విమర్శించారు. సాయి కుటుంబాన్ని అమిత్ షా మంగళవారం ఫోన్ లో పరామర్శించారు. దోషులు ఎంతపెద్ద పదవిలో ఉన్నా శిక్షపడేలా చూస్తామన్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చిన అమిత్ షా అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.
పువ్వాడ అజయ్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడని ఒక మత చిహ్నాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ సాయిపై పోలీసులు ఏకంగా 16 కేసులు పెట్టారు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులు భరించలేక సాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మైనార్టీల సంక్షేమ నాయకుడు కులమత విభేదాలు లేని అపర భగీరథుడు ఖమ్మం జిల్లా అభివ్రుద్ధి ప్రదాత రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ ఖాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్టులు పెట్టడం, ఫ్లెక్సీలు వేయించడం ఇప్పుడు వైరల్ గా మారాయి. మంత్రి పువ్వాడ అజయ్ కు కమ్యూనిస్టు నేపథ్యం ఉంది. మొదటి నుంచి హిందువులను పట్టించుకోకపోవడం.సొంత కులానికి చెందిన సాయి విషయంలో ఆరోపణలు చేశాడు. సాయిపై కక్షకట్టి ఏకంగా 16కేసులు పెట్టి వేధించడం చివరికి ప్రాణాలు తీసుకునేలా చేశాడాని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు భార్యను ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నాని విమర్శిస్తే తీవ్ర విమర్శలు గుప్పించిన తెలంగాణ కమ్మ సంఘం సాయి విషయంలో స్పందించకపోవడం కమ్మ సామాజిక వర్గం కమ్మ సంఘం అధ్యక్షుడు అరికెపూడి గాంధీపై ఫైర్ అవుతుంది. డబ్బున్న కమ్మలనే కమ్మ సంఘం పట్టించుకుంటుందా అని ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి అనుకూలంగా పోస్టుల్లో పువ్వాడ అజయ్ ఖాన్ అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Related News
Khammam Politics: పువ్వాడ ఎన్నికల అఫిడవిట్ పై ఈసీకి తుమ్మల ఫిర్యాదు
మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు అఫిడవిట్ ఫార్మాట్ మార్పుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు