Munugode by-poll: మునుగోడు బరిలో రెడ్లు!
మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చాయి.
- By hashtagu Published Date - 11:39 AM, Sun - 9 October 22
మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడు ఉపఎన్నికల బరిలో రెడ్లుకు కేటాయించారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి ఈ ఉపఎన్నికలో బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి బీసీ నేతలు బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్ఠానం ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అందోజు శంకరాచారిని తమ పార్టీ అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే మునుగోడులో అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు వాలిపోయారు. ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పార్టీలు ప్రచారం విస్తృతం చేశాయి. ఇప్పటికే పలు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విజయం సాధించాలని ప్లాన్లు వేస్తోన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్ రెడ్డి కూడా విజయం కోసం పలు వరాలు కురిపిస్తోన్నారు. అయితే ఏ పార్టీ విజయం సాధించిదో నవంబర్ 6న తేలనుంది.
Related News
Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నాకెప్పుడో తెలుసు: మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.