HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavithas Comment On The Budget The Government That Has Not Taken Steps To Implement The Six Guarantees

MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం, బడ్జెట్ పై కవిత కామెంట్

  • By Balu J Published Date - 11:31 PM, Wed - 14 February 24
  • daily-hunt
Mlc Kavitha, chandrababu
Mlc Kavitha

MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. “సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? అని ప్రశ్నించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ పై బుధవారం నాడు శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సభను స్థంభింపజేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు.

రానున్న ఐదేళ్లకు పునాది వేసే బడ్జెట్ లో మొదటి ఏడాదే ప్రజలకు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పలేకపోయిందని తప్పుబట్టారు. బడ్జెట్ మొత్తం ఆత్మస్తుతి, పరనిందలతో ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్పా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో బడ్జెట్ లో చెప్పలేదని అన్నారు. ఖర్చులేని అంశాలు, వివాదాస్పద అంశాలు, పార్లమెంటు ఎన్నికల వరకు ఏ విధంగా కాలయాపన చేయాలన్న అంశాలు తప్పా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై ఎక్కడా చెప్పలేదని వివరించారు. ఆరు గ్యారెంటీలు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని ఎన్నికల సమయంలో పదేపదే ముఖ్యమంత్రి ప్రచారం చేశారని, కానీ ఆ గ్యారెంటీల్లో 10 శాతం అంశాలు కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రతినిత్యం ప్రజలను కలవాల్సిందే అన్న అపోహను కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని, ఆ క్రమంలో ప్రజావాణి కార్యక్రమం పేరిట ప్రతి రోజు సీఎం ప్రజలను కలుస్తారని కాంగ్రెస్ ప్రకటించిందని, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒకరోజు మాత్రమే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారని ఎత్తిచూపారు. ఇప్పుడు కేవలం ఐఏఎస్ అధికారులే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇదే తరహాలో నిర్వహించేవారని, మరి పాత పద్ధతినే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.

ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్లు ఢిల్లీవాణి వింటున్నారు తప్పా ప్రజావాణి వినడం లేదని ధ్వజమెత్తారు. ప్రజావాణికి సీఎం ఒక్కసారే వెళ్లారని, కానీ ఢిల్లీకి మాత్రం వారానికి రెండు సార్లు వెళ్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన రాష్ట్రానికి వస్తే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ప్రొటొకాల్ ఇచ్చి స్వాగతించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చు కోసం తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు హైదరాబాద్ లోనే రోజుకు 3-4 గంటలు కరెంటు పోతుంటే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతున్నదని మండిపడ్డారు. గత రెండు నెలల్లో సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ముగ్గురు ఆడబిడ్డలను ఆత్మహత్య చేసుకుంటే స్పందించడానికి సీఎంకు తీరిక లేదా అని నిలదీశారు.

బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే దాదాపు రూ. కోటి 36 లక్షల కోట్లు అవరమవుతాయని అంచనా అని, కానీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేవలం రూ. 53 వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని ప్రభుత్వం చెప్పిందని వివరించారు. మహాలక్ష్మీ పథకం కింద 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కోటి39 లక్షల మందికి మహాలక్ష్మీ మొత్తం పంపిణీ చేయాలంటే రూ. 49 వేల కోట్లు అవసరమవుతాయని, కాబట్టి ఈ అంశాన్ని ప్రభత్వం బడ్జెట్ లో ప్రస్తావించలేదని ఎండగట్టారు. కళ్యాణ లక్ష్మీ కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ హామీని ఎప్పుడు అమల చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 70 లక్షల మంది మహిళల పేరిట గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయని, కేవలం మహిళల పేరిట ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇస్తారా లేదా పురుషుల పేరిట ఉన్న కనెక్షన్లకు కూడా ఇస్తారా అన్న అంశంపై స్పష్టత లేదన్నారు. నెలకు ఒక సిలిండర్ మాత్రమే రూ. 500 కు ఇస్తారా లేదా రెండు నెలలకు ఒకసారా అన్నది స్పష్టత లేదని చెప్పారు.

ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తారని భావిస్తే రూ. 4200 కోట్లు అవసరమవుతాయని, కానీ ఈ మొత్తాన్ని బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. వికలాంగులకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించే రాష్ట్రంలో 95.23 లక్షల మీటర్లు ఉన్నాయని, రూ. 6 వేల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్ లో మాత్రమే చేర్చలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏటా కనీసం రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని, కానీ ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తూ కేవలం రూ. 7 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని తెలియజేశారు. అలాగే, 43 లక్షలకుపైగా మందికి ఇప్పటికే పెన్షన్లు అందుతున్నాయని, పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని చెప్పి ఇప్పటికీ పెంచలేదని, మరి పాత పెన్షన్లే ఇచ్చేదుంటే ఇక కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ లో ప్రకటించిన హామీలను బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి అమరవీరుడి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగమిస్తామని చెప్పారని, నిరుద్యోగ భృతి, ప్రైవేటు రంగంలో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆడబిడ్డలకు ఈ-స్కూటర్ల పంపిణీ, ఫీజు రియింబర్స్ మెంట్ వంటి హామీల అమలు దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా మందుకేయలేదని అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • hard comments
  • MLC Kavitha
  • state budjet

Related News

It was the Congress government that turned SCs and STs into rulers: CM Revanth Reddy

Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

Congress : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

  • CM Revanth

    KTR & Kishan Reddy : కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ – సీఎం రేవంత్

  • Inspections Brs

    Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత

  • Konda Out

    Telangana New Cabinet : కొండా అవుట్..విజయశాంతి ఇన్ ..?

Latest News

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd