Komatireddy Brothers: మునుగోడు రిజల్ట్ పైనే ‘కోమటిరెడ్డి’ బ్రదర్స్ ప్యూచర్
ఇటీవల కాలంలో దేశంలో అత్యంత చర్చనీయాంశమైన ఎన్నికలలో మునుగోడు ఉప ఎన్నిక ఒకటి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు
- By Balu J Published Date - 04:53 PM, Fri - 4 November 22
ఇటీవల కాలంలో దేశంలో అత్యంత చర్చనీయాంశమైన ఎన్నికలలో మునుగోడు ఉప ఎన్నిక ఒకటి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే సూచించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. గత ఎన్నికల కంటే అధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. వేలాది మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవడంతో అధిక ఓటింగ్ శాతం నమోదు కావడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఇతర పార్టీల కంటే, బిజెపి తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని దూకుడు మీద ఉండటంతో ఆ పార్టీకి చాలా కీలకం. బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మునుగోడుతో నాలుగో ఎమ్మెల్యేను చేర్చుకోవాలని భావిస్తోంది.
అందుకే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో బీజేపీ టచ్లోకి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రాజ్గోపాల్ రెడ్డి బీజేపీ నేతగా, మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా బరిలోకి దిగారు. నల్లగొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెట్టింది పేరు. మునుగోడు ఉప ఎన్నికతో ఈ బ్రదర్స్ రాజకీయకంగా వీడిపోయినట్టయింది. వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే రాజ్గోపాల్రెడ్డి బీజేపీ పార్టీలో చేరారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఇదే విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే రాజ్ గోపాల్ రెడ్డి వ్యాపార రంగంలో ఉన్నారని, ఆరోపణల్లో నిజం లేదని ఆయన అనుచరులు తెలిపారు.
రాజగోపాల్ భవిష్యత్తు మునుగోడు ఫలితంపైనే ఉంది. ఎన్నికల్లో గెలవకపోతే ఆయనకు భవిష్యత్తు ఉండదు. రాజ్గోపాల్రెడ్డిని ప్రోత్సహించడం కంటే మరో ఎమ్మెల్యే వైపు బీజేపీ ఆసక్తి చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆయనే కాదు సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రమాదంలో పడ్డారు. ఇప్పటికే ఆయన ఆడియో లీక్ వ్యవహరం టీకాంగ్రెస్ లో చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ ఇప్పటికే రెండు షోకాజ్ నోటీసులు కూడా పంపింది. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్రలో మెరిస్తే, కోమటిరెడ్డి దూరంగా ఉండటం కూడా మరింత మైనస్ గా మారనుంది.
Related News
UPSC : సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్ ప్రదాన్ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణుల�