kandala Upender Reddy : పాలేరులో బెదిరింపులకు దిగుతున్న కందాల ఉపేందర్ రెడ్డి
మంచిగా మాట్లాడు..లేదంటే బొక్కలో వేస్తా అంటూ హెచ్చరించాడు
- By Sudheer Published Date - 01:37 PM, Sat - 25 November 23
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. మరో మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ..ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. అయితే పలు చోట్ల అధికార పార్టీ బిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురవుతుంది. తమకు ఏ న్యాయం చేసారని మీకు ఓటువేయాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పాలేరు (Paaleru) నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
సదరు సర్పంచ్..కందాల ఉపేందర్ రెడ్డి (kandala Upender Reddy) తో మీ గెలుపుకు కృషి చేసానని..అయనప్పటికీ తమకు ఏ న్యాయం జరగలేదని..సొంత డబ్బులు ఖర్చు చేసినప్పటి ఏ కాంట్రాక్ట్ తమకు ఇవ్వలేదని..దీంతో అప్పులపాలయ్యానని నిలదీసాడు. దీంతో ఉపేందర్ రెడ్డి..బెదిరింపులకు దిగాడు..మంచిగా మాట్లాడు..లేదంటే బొక్కలో వేస్తా అంటూ హెచ్చరించాడు. అయినప్పటికీ సదరు సర్పంచ్ ఏమాత్రం భయపడకుండా తాను అడగాల్సినవన్నీ అడిగేశాడు. ఇలా ఇదెక్కటే కాదు చాల చోట్ల ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం పాలేరు పబ్లిక్ టాక్ చూస్తే..ఈసారి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపు కష్టమే అని తెలుస్తుంది. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని , తుమ్మల చేసిన అభివృద్దే కానీ ఈయన చేసింది ఏమిలేదని అంటున్నారు.
కందాల ఉపేందర్ మొదటగా కాంగ్రెస్ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప బిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల (Thummala) నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరి..మరోసారి ఎమ్మెల్యే బరిలో నిలిచాడు. బిఆర్ఎస్ నుండి ఉపేందర్ బరిలోకి దిగితే..కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగాడు. మరి ఈ ఇద్దరిలో గెలుపు ఎవర్ని వరిస్తుందో చూడాలి.
Related News
AP Poll : ఏపీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ట్వీట్..
ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం ఉండబోతుందని ఈసీ అధికారులు , రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు , అభ్యర్థ