Operation ASAN : మేడ్ ఇన్ మెదక్.. ‘బీఎంపీ-2 శరత్’తో ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్
మన దేశంలో చాలా రకాల ఆయుధాల తయారీకి లైసెన్సులు కూడా ఇచ్చేసిన దేశం రష్యా(Operation ASAN).
- By Pasha Published Date - 02:17 PM, Tue - 29 October 24

Operation ASAN : ‘బీఎంపీ-2 శరత్’ ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వాహనాలపై ఇప్పుడు మన దేశమంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తాజాగా కశ్మీరులోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం నిర్వహించిన ‘ఆపరేషన్ అసన్’లో భారత ఆర్మీకి చెందిన ‘బీఎంపీ-2 శరత్’లను వినియోగించారు. అఖ్నూర్ సెక్టార్లో ఆర్మీ అంబులెన్స్పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టికరిపించారు. సోమవారం రోజే ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టగా.. మరో ఇద్దరి ఇవాళ ఉదయం అంతమొందించారు. ఈ ఆపరేషన్ కోసం వెళ్లిన ఎన్ఎస్జీ దళాలు ‘బీఎంపీ-2 శరత్’ ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వాహనాలను వినియోగించాయి. తెలంగాణలోని మెదక్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఈ వాహనాల గురించి వివరాలివీ..
Also Read :Electricity Charges : గుడ్ న్యూస్.. కరెంటు ఛార్జీలు పెంచబోం : తెలంగాణ సర్కారు
‘బీఎంపీ-2 శరత్’ గురించి..
- మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సైనికపరంగా అన్ని రకాల సాయాన్ని అందిస్తున్న దేశం రష్యా. మన దేశంలో చాలా రకాల ఆయుధాల తయారీకి లైసెన్సులు కూడా ఇచ్చేసిన దేశం రష్యా(Operation ASAN). భారత్ – రష్యా సంబంధాలు అంత బలంగా ఉన్నాయి మరి.
- 1960వ దశకంలో ‘బీఎంపీ-1’ ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ను మన దేశానికి రష్యా అందించింది. చైనా, పాకిస్తాన్ నుంచి సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆనాడు వీటిని వినియోగించారు. కాల క్రమంలో భారత్ ఈ వాహనాల్లో సొంతంగా చాలా మార్పులు చేసింది.
- ‘బీఎంపీ-1’ ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్కు అడ్వాన్స్డ్ వర్షనే ఈ ‘బీఎంపీ-2 శరత్’.
- బీఎంపీ అంటే బొయేవయా మషినా పెఖోతీ (Boyevaya Mashina Pekhoty). ఇది రష్యన్ భాషా పదం.
- బీఎంపీ-2 వాహనాలు నీటిలో కూడా ప్రయాణించగలవు. వీటిపై నుంచి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించవచ్చు.
- తెలంగాణలోని మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే వీటిని తయారుచేస్తున్నారు. ఈ వాహనాల చుట్టూ బలమైన కవచం ఉంటుంది. దీనివల్ల ఉగ్రవాదులు కాల్పులు జరిపినా.. లోపల ఉన్న సైనికుల ప్రాణాలకు నష్టం వాటిల్లదు.
- ఈ ట్యాంకులపై ఉండే భారీ మెషీన్ గన్లు, గ్రనేడ్ లాంఛర్లతో ఉగ్రవాదులపై కాల్పులు జరపొచ్చు. అందుకే అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ఈజీగా పూర్తయింది.
- ఈ ఆపరేషన్లో భారత సైన్యం ఫాంటమ్ అనే పేరు కలిగిన జాగిలాన్ని కోల్పోయింది.
Also Read :Jagdish Uikey : విమానాలకు బాంబు బెదిరింపుల వెనుక జగదీశ్ ఉయికే.. ఎవరు ?