HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >In Secunderabad Agnipath Violence How 40 Train Passengers Were Rescued

Agnipath Violence: సికింద్రాబాద్ లో రైలు బోగీకి నిప్పు.. 40 మందిని ఇలా రక్షించారు!

"అగ్నిపథ్" స్కీంపై నిరసనలు ఉధృతం అవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా శుక్రవారం రణ రంగంగా మారింది.

  • By Hashtag U Published Date - 12:05 AM, Sat - 18 June 22
  • daily-hunt
Stattion
Stattion

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన
“అగ్నిపథ్” స్కీంపై నిరసనలు ఉధృతం అవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా శుక్రవారం రణ రంగంగా మారింది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు..కనీసం 5,000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి 40 మంది ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్‌కు నిప్పుపెట్టడానికి యత్నించారు. నిప్పుపెట్టగానే రైల్వే సిబ్బంది స్పందించి.. వారందరినీ పక్కనే ఉన్న కోచ్‌లోకి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఏ1 కోచ్‌పై నిరసనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సమయంలో కనీసం 40 మంది ప్రయాణికులు లోపల ఉన్నారని గుర్తించారు.

40 మందిని ఎలా కాపాడారంటే..?

ఆందోళనకారులు కోపంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఏ1 రైల్వే కోచ్‌ కు నిప్పంటించే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఆ కోచ్ లోని 40 మంది ప్రయాణికులను వేరే కోచ్ లోకి తరలించారు. హింసాత్మక ఘటనల మధ్య.. సాహసోపేతంగా వ్యవహరించి ప్రయానికులను కోచ్ నుంచి బయటికి తరలించారు.
ఆ సమయానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని రెండు ప్రధాన గేట్లు కూడా తెరిచి ఉండటం కలిసొచ్చింది. దీంతో ఒక గేటు ఉన్న వైపు నుంచి ప్రయాణీకులను సురక్షితంగా తరలించే అవకాశం కలిగింది. ఈక్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది చూపిన చొరవ అంతా ఇంతా కాదు. కాగా, అగ్నిపథ్ నిరసనకారులు 4-5 రైలు ఇంజన్లు, 2-3 కోచ్‌లకు నిప్పు పెట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేటందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. నిరసనకారుల రాళ్ల దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 rescued
  • agnipath scheme
  • railway platform
  • secunderabad station
  • train vandalised

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd