Hyderabad: మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో 100 ఫోన్లు మాయం
నగరంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు దొంగలకు అవకాశంగా మారాయి. మరికొందరికి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వేలాది మంది సమూహం నేపథ్యంలో దొంగలు రెచ్చిపోయారు.
- By Praveen Aluthuru Published Date - 07:50 AM, Mon - 2 October 23
Hyderabad: నగరంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు దొంగలకు అవకాశంగా మారాయి. మరికొందరికి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వేలాది మంది సమూహం నేపథ్యంలో దొంగలు రెచ్చిపోయారు. మొబైల్ ఫోన్లను టార్గెట్ చేశారు. ఎంతో ఉత్సాహం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు అనేక మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. మక్కా మసీదు, చార్మినార్ స్మారక చిహ్నం, లాడ్ బజార్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను కలిపే చార్మినార్ వద్దకు వేలాది మంది చేరుకున్నారు.చార్మినార్, యాకుత్పురా రోడ్, అలీజా కోట్ల, మీరాలం మండి, షాహలీబండ తదితర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా దాదాపు 100 మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారని అంచనా. మఫ్టీలో ఉన్న పోలీసు అధికారులు జేబు దొంగల ముఠాలపై నిఘా ఉంచారు, కానీ అసలు ముఠాను గుర్తించలేకపోయారు.
మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వ్యక్తులు తమ ఫోన్ సర్వీసులను ఆపివేసేందుకు https://www.ceir.gov.in వెబ్సైటుని సందర్శించాలని పోలీసులు సూచించారు. పోయిన ఫోన్ IMEI మరియు అవసరమైన పత్రాలతో సహా ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్లో అభ్యర్థించిన వివరాలను అందించాలి. తర్వాత 24 గంటల్లో ఫోన్ బ్లాక్ చేయబడుతుంది.ఫోన్ బ్లాక్ అయిన తర్వాత భారతదేశంలోని ఏ నెట్వర్క్లోనూ పని చేయదు. అయితే ఎవరిదైతే ఫోన్ పోయిందో వాళ్ళు తమ ఫోన్ పాత్రలను లేదా, ఏదైనా ఫోన్ కి సంబందించిన వివరాలను జత చేయాల్సి ఉంటుంది.
Also Read: Trafic In KPHB : హైదరాబాద్ కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే..?
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.