Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భారీ స్పందన
Rajeev Swagruha : ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వ లేఅవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చేయబడటం, కొనుగోలుదారులకు వెంటనే ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కల్పిస్తోంది
- Author : Sudheer
Date : 18-11-2025 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్లో ఇళ్లు నిర్మించాలనుకునే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అందిస్తున్న ప్లాట్ల వేలం మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 163 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించగా, నవంబర్ 17న తొలిరోజు తొర్రూర్లో 59 ప్లాట్ల వేలం విజయవంతంగా నిర్వహించారు. ఈ వేలంలో చదరపు గజం కనీస ధర రూ.25 వేలుగా నిర్ణయించినప్పటికీ, పోటీ పెరగడంతో గరిష్ఠ ధర రూ.39 వేల వరకు చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే రూ.46 కోట్ల ఆదాయం రావడం, ఈ ప్లాట్లకు ఉన్న డిమాండ్ను స్పష్టంగా సూచిస్తోంది.
Jobs : RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!
బహిరంగ వేలం పట్ల కొనుగోలుదారుల్లో భారీ ఆసక్తి కనిపిస్తుండడంతో, రెండో రోజు కూడా పెద్ద అంబర్పేట్లోని అవికా కన్వెన్షన్ సెంటర్లో వేలం కొనసాగుతుంది. మంగళవారం బహదూర్పల్లి, కుర్మల్గూడ, తొర్రూర్ ప్రాంతాలలోని మొత్తం 103 ప్లాట్లు వేలం పాటకు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.20 వేల నుండి రూ.30 వేల మధ్య నిర్ణయించగా, డిమాండ్ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్లాట్ల విస్తీర్ణం 200 నుంచి 1000 గజాల వరకు ఉండటం, కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటికే తొర్రూర్ లేఅవుట్లో 885 ప్లాట్లలో 517 ప్లాట్లు విక్రయించబడిన నేపథ్యంలో, మిగిలిన ప్లాట్లకు కూడా భారీ పోటీ కనిపిస్తోంది.
iBomma రవి జీవితకథలో సినిమా రేంజ్ ట్విస్ట్ లు
ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వ లేఅవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చేయబడటం, కొనుగోలుదారులకు వెంటనే ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ఈ ప్లాట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటం వలన భూమి వివాదాలు, కేసులు, చట్టపరమైన చిక్కులు లేకపోవడం కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భూముల ధరలు పెరుగుతున్న తరుణంలో, ఈ ప్లాట్లు భద్రతతో కూడిన మంచి పెట్టుబడిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రస్తుతం నగర రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధాన చర్చగా మారింది.