Telangana Budget 2022 Highlights : తెలంగాణ బడ్జెట్ – హైలైట్స్
ఆర్ధిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో హైలైట్స్ ఏంటో చూడండి
- By Hashtag U Published Date - 12:04 PM, Mon - 7 March 22

LIVE NEWS & UPDATES
-
07 Mar 2022 01:29 PM (IST)
వివిధ రంగాలకు కేటాయింపులు
* నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు
* ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు
* కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
* 9,123 స్కూళ్లలో మన ఊరు - మనబడికి రూ.3,497 కోట్లు
* డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
* రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు
* ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
* బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు
* బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
* ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు
-
07 Mar 2022 01:28 PM (IST)
తెలంగాణ బడ్జెట్ స్వరూపం
* తెలంగాణ బడ్జెట్ రూ.2,56,958 కోట్లు.
* రెవెన్యూ వ్యయం 1,89,274.82 కోట్లు.
* పెట్టుబడి వ్యయం రూ.29,728.44 కోట్లు.
* దళిత బంధుకు రూ.17,700 కోట్లు.
* దళిత బంధు ద్వారా ఈ ఏడాది 11,800 కుటుంబాలకు లబ్ధి.
* గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.227.5 కోట్లు.
* వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు.
* హరిత హారానికి రూ.932 కోట్లు.
* పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1394 కోట్లు.
* పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు.
* అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు.
* కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు.
* మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలు.
* సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం.
* తెలంగాణలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, ఇందుకు రూ.వెయ్యి కోట్లు.
* రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యం.
-
07 Mar 2022 01:27 PM (IST)
ఆర్టీసీ కోసం 1500కోట్లు
* ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కి ఈ బడ్జెట్ లో 1500 కోట్లు కేటా
-
07 Mar 2022 01:27 PM (IST)
మెట్రో పరిధిలో ఉచితంగా రోజుకు 20 లీటర్ల నీరు
* హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి 300 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించడమైనది.
-
07 Mar 2022 01:25 PM (IST)
పావలా వడ్డీ స్కీం
* పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు , చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసి విధంగా ప్రోత్సహించడానికి 187 కోట్లు కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 01:25 PM (IST)
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
* పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా 2142 కోట్లు , పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద 190 కోట్లను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 01:23 PM (IST)
హైదరాబాద్ మెట్రోకు 1500 కోట్లు
* ఏయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో 1500 కోట్లు కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 01:22 PM (IST)
అర్బన్ మిషన్ భగీరథకు 800 కోట్లు
* అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్దెట్ లో 800 కోట్లు కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 01:21 PM (IST)
కాళేశ్వరం టూరిజం
* కాళేశ్వరం టూరిజం సర్య్యూట్ కు 750 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 01:20 PM (IST)
సొంత జాగా ఉన్నోళ్ళకు గుడ్ న్యూస్
* రాష్ట్ర వ్యాప్తంగా సొంత జాగల్లో ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం.
* దీని కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు ఇస్తాం.
* ఈ ఏడాది నాలుగు లక్షల ఇండ్లను నిర్మించనున్నాం.
* ఒక్కొక్క లబ్దిదారుడికి రూ.3 లక్షలను ప్రభుత్వం సహాయంగా అందిస్తుంది.
* 12వేల కోట్లను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది కేటాయించనున్నాం.
-
07 Mar 2022 01:19 PM (IST)
గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు
* గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* దీని కోసం ఈ ఏడాది 600 కోట్ల రూపాయలను వెచ్చించనున్నాం.
-
07 Mar 2022 01:17 PM (IST)
నేత కార్మికులకు గుడ్ న్యూస్
* రైతు బందు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయించింది.
-
07 Mar 2022 01:16 PM (IST)
భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ళు
* భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం.
* మొదటి విడుతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించడమైంది.
* దీనికి సంబంధించిన విధివిదానాలు త్వరలో ప్రకటిస్తారు.
-
07 Mar 2022 01:15 PM (IST)
మెట్రో రైలు అనుసంధానం కోసం 500 కోట్లు
* మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్లో 500 కోట్లు కేటాయించడమైంది.
-
07 Mar 2022 01:14 PM (IST)
రోడ్ల నిర్మాణం, మరమ్మతులకోసం.. 1542కోట్లు
* రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం 1542 కోట్లను ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించింది.
-
07 Mar 2022 01:13 PM (IST)
దూప దీప నైవేధ్య పథకంలో హైదరాబాద్లోని దేవాలయాలు
* దూప దీప నైవేధ్య పథకంలో హైదరాబాద్లోని దేవాలయాలను చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఈ ఏడాది 1736 దేవాలయాలను కొత్తగా ఈ పథకంలో చేరుస్తున్నారు.
* దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
-
07 Mar 2022 01:12 PM (IST)
శాశ్వతంగా నీటికొరతను తీర్చేందుకు.. 1200 కోట్లు
హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్లను ఈ వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు
-
07 Mar 2022 01:10 PM (IST)
స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్ధినుల కోసం హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్
* రాష్ట్రన వ్యాప్తంగా అన్నిప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
* ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.
-
07 Mar 2022 01:09 PM (IST)
బాలింతలకు కేసీఆర్ నూట్రీషియన్కిట్
* బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
* ఈలోపాన్ని నివారించేందుకు, ‘కేసీఆర్ నూట్రీషియన్కిట్’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిర్ణయించింది.
* ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
-
07 Mar 2022 01:09 PM (IST)
గీత కార్మికుల కోసం 100 కోట్లు
* గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేకపథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-
07 Mar 2022 01:07 PM (IST)
నేతన్నల కోసం 5 లక్షల భీమా
* రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది.
-
07 Mar 2022 01:05 PM (IST)
గొర్రెల పంపిణీ కోసం వెయ్యి కోట్ల
* గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది.
* అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
* ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది.
-
07 Mar 2022 01:04 PM (IST)
ఎస్టీఎస్డీఎఫ్ నిధులు
* ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి వేయికోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 01:02 PM (IST)
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంకోసం 12000 కోట్లు
* సొంత జాగ కలిగినవారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్లో అందుకు నిధులు కేటాయించడం జరిగింది.
* రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి , సొంత స్థలంలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది.
* నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంకోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించింది.
-
07 Mar 2022 01:01 PM (IST)
వద్ధులకు గుడ్ న్యూస్
* వృద్ధాప్యఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించింది.
* ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వంఅందజేస్తుంది.
* ఆసరా ఫించన్లకోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో11728 కోట్ల రూపాయలు ప్రతి పాదించడమైనది
-
07 Mar 2022 12:59 PM (IST)
వ్యవసాయానికి పెద్దపీట.. రైతు సంక్షేమం కోసం భారీగా నిధులు
* వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది.
* గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్లరూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది.
* రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం.
* ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది.
* రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం.
* ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం.
* గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించాం.
-
07 Mar 2022 12:48 PM (IST)
పామాయిల్ సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్
2022-23 సంవత్సరంలో బడ్జెట్ లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాల లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందు కోసం ఈ బడ్జెట్ లో వేయి కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోన్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరోకటి లేదు.
-
07 Mar 2022 12:47 PM (IST)
ఆదాయ మార్గాలు.. అంచనా మాత్రమే
* పన్ను ఆదాయం - రూ.1,08,212 కోట్లు
* కేంద్ర పన్నుల్లో వాటా - రూ.18,394 కోట్లు
* పన్నేతర ఆదాయం - రూ.25,421 కోట్లు
* గ్రాంట్లు - రూ.41,001 కోట్లు
* రుణాలు - 53,970 కోట్లు
* అమ్మకం పన్ను అంచనా - రూ.33 వేల కోట్లు
* ఎక్సైజ్ ద్వారా ఆదాయం - రూ.17,500 కోట్లు
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం - రూ.15,600 కోట్లు
-
07 Mar 2022 12:45 PM (IST)
మార్చురీల ఆధునీకరణకు 32.50 కోట్ల
రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32 కోట్ల 50 లక్షలరూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. (ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది.)
-
07 Mar 2022 12:44 PM (IST)
పారిశుధ్యకార్మికుల వేతానాలు పెంచనున్న కేసీఆర్ సర్కార్
పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది.
-
07 Mar 2022 12:42 PM (IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారం కోసం 43.5కోట్ల
* ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలని, ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు (డబుల్) చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది.
* టీ.బీ., క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయలనుంచి 112 రూపాయలకు పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయలనుంచి 80 రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది.
* దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
* హైదరాబాద్ లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలన ఈ బడ్జెట్లో నిర్ణయంచడం జరిగింది.
* రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి.
-
07 Mar 2022 12:37 PM (IST)
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు.
* ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
* 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
* నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
-
07 Mar 2022 12:35 PM (IST)
మహిళా విశ్వ విద్యాలయాల కోసం 100కోట్లు
- రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.
- ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈబడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 12:34 PM (IST)
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం..మనఊరు- మనబడి
* రెండో దశలోఇతర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మనఊరు- మనబడి పథకాన్నిప్రారంభించింది.
* రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
* పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది.
* రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది.
* మొదటి దశలో మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది.
-
07 Mar 2022 12:31 PM (IST)
దళిత బంధుకు భారీగా నిథులు
* దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు.
* గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.
* దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది.
* దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికివందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది.
* వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బడ్జెట్లో 17,700కోట్లరూపాయలను కేటాయించడం జరిగింది.
-
07 Mar 2022 12:30 PM (IST)
రైతులకు గుడ్ న్యూస్
* రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
* వచ్చే ఆర్థిక ఏడాది నుంచి రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
* మొత్తం పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
* విడతల వారీగా 5.12 లక్షల మంది రైతులకు రుణాల మాఫీ ద్వారా లబ్ధి
-
07 Mar 2022 12:26 PM (IST)
అసెంబ్లీ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైమ్లో మంత్రి హరీష్ రావు ప్రసంగానికి ఆటంకం కల్గించినందుకు గానూ, సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు గేటు బయట నిరసనకు దిగారు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ముగ్గురూ అసెంబ్లీ ఎదుట ఎండలో బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు.
1234
-
07 Mar 2022 12:20 PM (IST)
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తున్న నేపధ్యంలో.. తీవ్ర ఆటంకం కలిగించిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావును సభ వదిలి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చదువుతుండగా మంత్రి తలసాని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ దానికి ఆమోదించారు. ఈ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ వెల్లడించారు.
-
07 Mar 2022 12:18 PM (IST)
కంఠంలో ప్రాణం ఉండగా విద్యుత్ సంస్కరణలకు కేసీఆర్ ఒప్పుకోరు.
కరోనాతో సంక్షోభం ఎదురైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్ రావు అన్నారు. ఏదో కంటితుడుపుగా షరతులతో కూడిన రుణ పరిమితి పెంచిందని స్పష్టం చేశారు. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని షరతు పెట్టిందని, అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానేకాదని, కంఠంలో ప్రాణం ఉండగా విద్యుత్ సంస్కరణలకు కేసీఆర్ ఒప్పుకోరని హరీష్ రావు అన్నారు.
-
07 Mar 2022 12:14 PM (IST)
బీజేపీ అన్యాయపు లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
కేంద్రంలో అధికారంలో బీజేపీ, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం లెక్కల్ని మంత్రి హరీష్ రావు బయటపెట్టారు. ఈ క్రమంలో పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని బీజేపీ నేతలు అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం సహకారం లేదని.. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసిందన్నారు. కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం లేదని హరీష్ రావు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని, విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని హరీష్ రావు తేల్చి చెప్పారు.
-
07 Mar 2022 12:09 PM (IST)
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయాయి
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయాయి. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారన్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని.. తెలంగాణ అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా దూసుకుపోతుందని, ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్ అని, నేడు తెలంగాణ వ్యవహరిస్తున్నదే, రేపు భారత్ కూడా అనుసరిస్తుందని హరీష్ రావు అన్నారు.