వడ్లను ఎప్పటి నుంచి కొంటారో రేవంత్ సర్కారు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడి తీరుతామని స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి.. మేం బోనస్‌తో వడ్లు కొంటామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు.. రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలి. తుఫాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయి.అలాంటి వాళ్ళను ఆదుకోవాలి’’ అని ఆయన తెలిపారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన(BRS First Demand) మాట్లాడారు.

Also Read: Tiger – 3640 Metres : వామ్మో.. అంత హైట్‌లోనూ టైగర్స్