Cong In MLC Polls: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసొచ్చిన అంశాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా కాంగ్రెస్ జోష్ లోనే ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల అధికార పార్టీకి చెమటలు పట్టించింది.
- By Siddartha Kallepelly Published Date - 10:12 PM, Tue - 14 December 21
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా కాంగ్రెస్ జోష్ లోనే ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల అధికార పార్టీకి చెమటలు పట్టించింది.
చాలరోజుల నుండి తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉరటనిచ్చాయని చెప్పొచ్చు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొత్తం12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 6 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నేరుగా బరిలో దిగారు. మిగతా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. మెదక్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి బరిలో దిగగా, ఖమ్మం నుంచి రాయల నాగేశ్వరరావు పోటీ చేశారు. ఈ రెండు స్థానాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఛాలెంజ్ గా తీసుకున్నారు.
కాంగ్రెస్ పోటీచేసిన ఈ రెండు చోట్ల గెలుపుకు కావాల్సిన ఓట్లు కాంగ్రెస్ కు లేవు. కాంగ్రెస్ కూడా గెలవమని తెలిసినా గట్టి పోటీ ఇవ్వాలనుకొంది. ముఖ్యంగా తన ఓటు బ్యాంకు ను కాపాడుకోవాలని ప్రయత్నించింది. మెదక్ లో కాంగ్రెస్ కు 230 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకు ను కాపాడుకోవడం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. 230 కి ఒక్క ఓటు తగ్గినా పార్టీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అయితే రిజల్ట్స్ లో ఏకంగా 8 ఓట్లు అదనంగా వచ్చాయి.
అలాగే ఖమ్మంలో భారీ గా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ కు కేవలం 96 ఓట్లు ఉండగా 242 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన ఎఫర్ట్ వర్క్ అవుట్ అయ్యింది. ఖమ్మంలో పక్కపార్టీల వాళ్ళవి దాదాపు 140 కి పైగా ఓట్లు సాధించడంతో కాంగ్రెస్ పుల్ జోష్ మీదుంది.
నల్లగొండ విషయంలో మాత్రం కాంగ్రెస్ పై విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో బరిలో దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చి గెలుపొందారు.
ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా ఉన్నా నేరుగా అభ్యర్థిని పెట్టకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతిచ్చారు.
ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వంత జిల్లా పాలమూరులో ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లాలో కనీసం పోటీ నిలపకపోవడం పట్ల కొత్త చర్చకు దారి తీస్తోంది. రేవంత్ కు పుల్ క్రేజ్ ఉందని పార్టీ పగ్గాలు అప్పగిస్తే కనీసం పోటీ చేసే ఆలోచన కూడా చేయలేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ ఛాలెంజ్ గా తీసుకొని ఒక్క స్థానం గెలిపించుకుంది. ఈ సారి రేవంత్ కనీసం పోటీ ఆలోచన కూడా చేయకపోవడంపై విమర్శలు వస్తోన్నాయి.
Tags
Related News
TG Lok Sabha Polling : పార్లమెంట్ ఎన్నికల్లో 12 , 14 సీట్లు సాదించబోతున్నాం – భట్టి
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. 17 స్థానాలకు సంబదించిన పోలింగ్ లో ఓటర్లు పెద్దత్తున కాకపోయినా పర్వాలేదు అనిపించేలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు మాకంటే మాకు మద్దతు తెలిపారని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)..ఎన్నికల్లో 12 నుండి 14 సీట్లు సాదించబోతున్న