Jagga Reddy: జగ్గారెడ్డి మనసులో ఏముంది?
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జగ్గారెడ్డి హాట్ టాపిక్ గా మారారు. పార్టీకోసం ఎంత చేసినా పార్టీ తనపట్ల సరిగా వ్యవహరించడం లేదనేది ఆయన ప్రధాన విమర్శ.
- By Siddartha Kallepelly Published Date - 03:19 PM, Sun - 27 February 22
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జగ్గారెడ్డి హాట్ టాపిక్ గా మారారు. పార్టీకోసం ఎంత చేసినా పార్టీ తనపట్ల సరిగా వ్యవహరించడం లేదనేది ఆయన ప్రధాన విమర్శ.
గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ నాయకులతో జగ్గారెడ్డికి పడడం లేదనేది బహిరంగ రహస్యమే. అయితే తనని పార్టీలోని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. తాను టీఆర్ఎస్ లోకి వెళ్తానని బయటి వాళ్ళకంటే ఎక్కువగా కాంగ్రెస్ వాళ్లే ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయటకి మాత్రం తాను టీఆర్ఎస్ పార్టీలోకి పొయ్యేది లేదు, బీజేపీ గూర్చి చర్చే లేదని స్పష్టం చేస్తున్నా జగ్గారెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడి ఇండిపెండెంట్ గా కొనసాగడం కష్టమైన పనే.
కాంగ్రెస్ తో ఇబ్బందులున్నా, కాంగ్రెస్ లో ఉండాలా? కొత్తపార్టీ పెట్టాలా అనే ఆలోచనలోనే ఉన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే చిరంజీవి లాంటి స్టార్ డమ్, కోదండరాం లాంటి ఇమేజ్ ఉన్నవాళ్ళకే పార్టీ నడపడం సాధ్యం కాలేదు. అలాంటిది కేవలం హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలోనే తెలిసిన జగ్గారెడ్డి పార్టీని లీడ్ చేయగలడా అనే సందేహం తప్పకుండా ఎదురవుతోంది.
ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న జగ్గారెడ్డి ఏం చేస్తే బాగుంటుందని కార్యకర్తల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…. జగ్గారెడ్డి కాంగ్రెస్ లోనే ఉండాలని అనుకునేవాళ్లు చప్పట్లు కొట్టాలని సమావేశంలో పాల్గొన్న వాళ్ళకి సూచించగా దాదాపు అందరు చప్పట్లు కొట్టి తమ నిర్ణయాన్ని తెలియచేసారు. కాంగ్రెస్ నుండి వెళ్లిపోవడం సరైందని అనుకునేవాళ్లు చప్పట్లు కొట్టాలనగానే సభలోని జనాలంతా సైలెంట్ గా ఉన్నారు. గత్యంతరం లేనప్పుడు, రాజకీయ కారణాలతో బయటకెళ్ళి కొత్తపార్టీ పెడితే నాకు మద్దతు ఇస్తారా అని జనం మధ్యలోని ఒక కార్యకర్తను అడగ్గా నేను కాంగ్రెస్ లోనే ఉంటాను. మీతో రాలేనని జగ్గారెడ్డి అనుచరుడు తేల్చి చెప్పాడు.
ఫైనల్ గా తాను సోనియా, రాహుల్ ని కలిసేదాకా రాజీనామా చేయనని నిర్ణయం తీసుకున్నారు. యూపీ ఎన్నికలు అవగానే వారిని కలుస్తానని, సోనియా, రాహుల్ ని కలిసాక పాజిటివ్ రిజల్ట్ రావాలని దేవుడ్ని మొక్కుకుంటున్నని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా నుండి పాజిటివ్ రిజల్ట్ రాకపోతే తన దారి తాను చూసుకోవాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు. తాను తీసుకునే నిర్ణయానికి తన కార్యకర్తలు సహకరించకున్నా తప్పు పట్టనని, ఊరు మొత్తం పాతవాళ్ళు సహకరించకున్నా, కొత్తవాళ్ళు కనీసం 50 మందైనా వస్తారు. వాళ్ళతోనే రాజకీయం చేసుకుంటానని జగ్గారెడ్డి ఫిక్స్ అయ్యారు.
తన చర్యలను చూస్తోన్న వారిలో కొందరు జగ్గారెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఫిక్స్ అంటుంటే మరికొందరు మాత్రం ఆయనకి కాంగ్రెస్ ని వదలడం ఇష్టం లేదని, తనకి పార్టీలో ప్రాధాన్యత పెరగడం కోసం కావాలనే పార్టీ పెద్దలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నడని అంటున్నారు.
సంగారెడ్డిలో మార్చి 21 న లక్ష మందితో సోనియా, రాహుల్ నాయకత్వంలోనే బహిరంగ సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. ఇక ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.
Related News
TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎన్నుకునేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది.