PM Modi : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు
- By Sudheer Published Date - 03:11 PM, Tue - 5 March 24
తెలంగాణలో ప్రధాని మోడీ (Modi) రెండు రోజుల పర్యటన (Telangana Tour) ముగిసింది. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని మోడీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండగా… ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పాత ఆనవాయితీని కొనసాగించారు. నిన్న ఆదిలాబాద్లో ప్రధానిని పెద్దన్నయ్యగా సీఎం సంబోధించారు.
వీడ్కోలు సందర్భంగా పదకొండు అంశాలకు సంబంధించిన మెమొరాండంలను ప్రధాని మోడీ అందజేశారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసినప్పుడు వివరించిన అంశాలు, అందజేసిన విజ్జప్తుల్లోనే కొన్నింటిని మరోసారి తాజా పర్యటన సందర్భంగా అందజేశారు. అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఇందులో ఉన్నాయి.
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు ఇవీ :
• హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించండి.
• తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి.
• హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ. 3 కోట్లు మంజూరు చేసింది. రూ. 7,700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తే అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులు, ఇటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కి.మీ దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి.
• ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం.
• రాష్ట్రంలో 100% ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి.
• తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి.
• హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.
We’re now on WhatsApp. Click to Join.
• భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల-మరికల్ ఫోర్ లేన్, మరికల్-డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.
• తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలి.
• ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలి. అందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
• నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్త్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ. 347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి అని కోరారు.
Read Also :
Tags
Related News
PM Modi : ప్రధాని మోడీ ప్రసంగాలపై పిటిషన్ల్..తొసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Lok Sabha elections: ప్రధాని మోడీ(PM Modi) లోక్సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు(Religious divisive speeches) చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘీంచారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్(petitions)ను ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) సోమవారం రోజు తోసిపుచ్చింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని, విచారణకు అర్హమైనది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు. We’re now on WhatsApp. Click