Chennamaneni Ramesh : చెన్నమనేని రమేశ్ పాస్పోర్టుపై కేంద్రం కీలక నివేదిక
Chennamaneni Ramesh : వేములవాడకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు జర్మన్ పాస్పోర్టు ఉందని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర హోం శాఖ నివేదించింది.
- By Pasha Published Date - 01:20 PM, Sat - 13 January 24
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో.. తాను జర్మనీ పౌరసత్వాన్ని వెనక్కి ఇచ్చేశానని చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఆయన దాఖలు చేసిన కౌంటర్ పిటిషనుపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దనీ, తుది వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది. కాగా, చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం(భారత్ తోపాటు జర్మనీ) కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: CBN-YS Sharmila : చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే ..?
ప్రపంచంలోనే 2024కిగానూ ఆరు దేశాల పాస్పోర్టులు అత్యంత శక్తిమంతమైనవిగా నిలిచాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. మంగళవారం విడుదలైన ‘హెన్లీ పాస్పోర్టు సూచీ’ నివేదికలో ఇవి తొలి స్థానంలో నిలిచాయి. 227 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానం దక్కించుకొంది. తొలి స్థానంలో నిలిచిన ఆరు దేశాల పాస్పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. గత ఐదేళ్లుగా ఈ సూచీలో సింగపూర్, జపాన్ తొలిస్థానంలో నిలుస్తున్నాయి. ఈసారి అదనంగా మరో నాలుగు దేశాలు వాటి సరసన చేరాయి. రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల పాస్ట్పోర్టులతో 193 దేశాలకు సౌకర్యవంతంగా వెళ్లొచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్పోర్టులు మూడో స్థానంలో ఉన్నాయి. వీటితో 192 దేశాలకు వెళ్లేందుకు ముందస్తు వీసా అవసరంలేదు. 191 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉన్న యూకే పాస్పోర్టు నాలుగో స్థానం దక్కించుకుంది.
Related News
Chennamaneni Hot Comments : ఆ సమస్యను పరిష్కరించకపోతే తిరగబడతా.. ఎమ్మెల్యే చెన్నమనేని వార్నింగ్
Chennamaneni Hot Comments : మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై ఇన్నాళ్లూ సున్నితంగా మాట్లాడిన వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు.. ఇప్పుడు గొంతును సవరించుకొని గర్జించారు.