Raj Bhavan: ‘ఎట్ హోమ్’ పదనిస
రాజ్ భవన్ వేదికగా సీన్ మారింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమంకు కేసీఆర్ హాజరు కానున్నారు.
- By CS Rao Published Date - 05:47 PM, Mon - 15 August 22
రాజ్ భవన్ వేదికగా సీన్ మారింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమంకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం కు రాజభవన్ మెట్లు ఎక్కిన కేసీఆర్ మళ్ళీ ఇప్పడు కనిపిస్తున్నారు. దీంతో గవర్నర్, కేసీఆర్ మధ్య గ్యాప్ కు ఫుల్ స్టాప్ తాత్కాలికంగా పడినట్టు అయింది. ఇక ఏపీ రాజభవన్ చంద్రబాబు, జగన్ కలయిక కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది.
విపక్షంలోకి వచ్చాక ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు వస్తుండడం ఇదే ప్రథమం. తొలిసారిగా చంద్రబాబు హాజరుకానుండడంతో అందరి దృష్టి రాజ్ భవన్ వైపు మళ్లింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ సాయంత్రం రాజ్ భవన్ లో తేనీటి విందు ఇస్తున్నారు. వారం క్రితం ఢిల్లీలో మోదీతో ప్రత్యేకంగా మాట్లాడిన సమయంలోనూ మీడియా దృష్టి అటువైపే మళ్లింది. మోదీతో చంద్రబాబు మాట్లాడిన క్షణాలను పత్రికలు, చానళ్లు హైలైట్ చేశాయి. ఇప్పుడు చంద్రబాబు ఏపీ రాజ్ భవన్ లో సీఎం జగన్ తో కలిసి ఒకే వేదిక పంచుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద చంద్రబాబు, కేసీఆర్ రాజభవన్ వేదికలపై స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.
Tags
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.