Bar & Restaurant Party: అది బీఆర్ఎస్ కాదు.. బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ!
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్న జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
- By Hashtag U Published Date - 11:49 AM, Tue - 4 October 22

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్న జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త అర్థం చెప్పారు. BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని ఆమె నిర్వచించారు. మెదక్ జిల్లాలో తన పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. వందలాది మంది రైతులు చనిపోతున్నారని, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ కనీసం ఆందోళన చెందడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన రుణాలన్నీ నేరుగా కేసీఆర్ ఫామ్హౌస్లోకి వెళ్లాయని ఆమె విమర్శించారు.
కేసీఆర్ లాగా ఏనాడూ బూటకపు దీక్ష చేపట్టనని, మహాత్మాగాంధీతో కేసీఆర్ తనను పోల్చుకోవడం తనను షాక్ కు గురి చేసిందని షర్మిల అన్నారు. కోట్లాది మంది ప్రజల పోరాటం, వందలాది మంది ప్రాణ, ఆస్తి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని, కానీ కేసీఆర్ మాత్రం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. అతని కుటుంబంలో ఎవరైనా లాఠీ ఛార్జ్ని ఎదుర్కొన్నారా? తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు పోగొట్టుకున్నారా? అని షర్మిల ప్రశ్నించారు.
మహాత్మాగాంధీతో పోల్చుకోడానికి సిగ్గుగా లేదా KCR? ప్రజలు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది కానీ నీ దొంగ దీక్షకు కాదు. రాష్ట్ర సొమ్మును పదికొక్కుల్లా తిని, ఇప్పుడు దేశాన్ని లూటీ చేయడానికి విమానాలు కొంటున్నారు. మహాత్మాగాంధీ పేరు ఉచ్చరించే అర్హత కూడా KCRకు లేదు.#PrajaPrasthanam #Medak pic.twitter.com/mHUdl3NCot
— YS Sharmila (@realyssharmila) October 3, 2022