Revanth: తెలంగాణ ప్రజలారా ఆత్మహత్యలు చేసుకోకండి
బీజేపీ, టీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు వైపులని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. రెండు పార్టీలు తమ ద్రోహపూరిత విధానాలతో తెలంగాణ బాధితుల మృతదేహాలపై రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందుదామని ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
- By Hashtag U Published Date - 11:03 PM, Sun - 30 January 22
బీజేపీ, టీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు వైపులని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. రెండు పార్టీలు తమ ద్రోహపూరిత విధానాలతో తెలంగాణ బాధితుల మృతదేహాలపై రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందుదామని ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, యువకులు తప్పుడు నిర్ణయాలు తీసుకోని తమ ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో నష్టపోతున్న అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, ప్రజల హక్కులకు కాంగ్రెస్ హామీగా ఉంటుందని రేవంత్ తెలియచేసారు.
కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో, రాష్ట్ ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో ఉద్యోగులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు భరోసా కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని రేవంత్ తెలిపారు. టీచర్ల ఆత్మహత్యలకు బీజేపీ, టీఆర్ఎస్ బాధ్యత వహించాలని, ఇప్పటికైనా ఆ వివాదాస్పద జీవోను రద్దుచేయాలని రేవంత్ రెండు పార్టీలను డిమాండ్ చేశారు.
Related News
TS : హరీశ్ రావు-రేవంత్ రెడ్డిల విద్యుత్ కోతల వివాదం
Power cuts controversy:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కోతల(Power cuts) విషయంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు గుప్పించారు. అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు పన్నుతారనే భ్రమల్లోనే రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించాలని అన్నారు. విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగ