HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Bjp Target On Congress War Rajagopal Reddy Calls To Seniore Leaders

BJP Target Congress: ‘కాంగ్రెస్ వార్’ పై బీజేపీ గురి.. అసంతృప్తులకు ఆహ్వానం!

తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న కుమ్ములాటను బీజేపీ (BJP) నిశితంగా పరిశీలిస్తోంది!

  • By Balu J Published Date - 12:33 PM, Mon - 19 December 22
  • daily-hunt
Bjp target congress
Politics

బీజేపీ (BJP), బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఎన్నికల సమరంలోకి దూసుకుపోతుంటే, తెలంగాణ కాంగ్రెస్ (TCongress) మాత్రం ఇందుకు విరుద్దంగా అంతర్గత కుమ్ములాటలు, విబేధాలు, గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోంభం ఇష్యూ ఇతర పార్టీలకు వరంగా మారనుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణపై గురిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కుమ్ములాటలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది బీజేపీ పార్టీ.

తెలంగాణ కాంగ్రెస్ (TCongress) లో టీసీసీసీ చీఫ్ రేవంత్, సీనియర్లకు ఏమాత్రం పడటం లేదు. ఆది నుంచి ఈ వర్గాల మధ్య విభేదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక ఓటమి కాంగ్రెస్ పతనాన్ని ప్రశ్నిస్తుండటంతో తాజాగా కొత్త కమిటీల చిచ్చు ఏకంగా సంక్షోభానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే మంచిదని హితబోధ పలికారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా బీజేపీ పార్టీలో చేరాలని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) పిలుపునిచ్చారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేవంత్ వ్యవహార శైలిని విమర్శించేందుకు ఉత్తమ్, భట్టి విక్రమార్క ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ఇన్ని రోజులు రేవంత్ బ్లాక్ మెయిలర్ అని, బ్రోకర్ అని చెబుతున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయగా, ఒకవేళ రేవంత్ కు అవకాశం ఇస్తే, రేవంత్ తెలంగాణను అమ్మేస్తారని అన్నారు. ప్రజల కోసం పోరాడిన చరిత్ర ఆయనకు లేదు అని రాజగోపాల్ (Rajagopal) అన్నారు. ‘‘తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోదీ నాయకత్వంలో కలిసి పని చేద్దాం’’ కాంగ్రెస్ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ఒకవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోదీతో భేటీ కావడం, మరోవైపు రాజగోపాల్ కాంగ్రెస్ సంక్షోంభం వ్యాఖ్యలు చేయడం తెలంగాణ (Telangana) రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. కాగా కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలతో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ రహస్యంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరే నేతలను బండి సంజయ్‌ రేపు ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకీ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వలస వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారు అన్న సీనియర్ ల ఆరోపణలతో టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి,సీతక్క, విజయ రామారావు, చారగొండ, వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేష్ తో పాటు పలువురు నేతలు రాజీనామా చేశారు. కాగా రాజీనామా చేసిన నేతలు అందరూ వారి రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కు పంపిన విషయం తెలిసిందే.

Also Read: Roja Boxing: బాక్సింగ్ రింగ్ లో రోజా పంచులు.. వీడియో వైరల్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • group politics
  • komatireddy rajagopal reddy
  • TCongress
  • Telangana BJP

Related News

Secret meeting with Congress MLAs is false: Rajagopal Reddy

TG Assembly Session : రేపట్నుంచి అసెంబ్లీకి రాను – రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG Assembly Session : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అసెంబ్లీ వద్ద తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అనుచరుల బల ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd