Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్
Ration Card KYC : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు డెడ్ లైన్ ముంచుకొస్తోంది.
- By Pasha Published Date - 01:22 PM, Wed - 28 February 24
Ration Card KYC : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు డెడ్ లైన్ ముంచుకొస్తోంది. రేషన్ కార్డును కొనసాగించడంలో కీలకమైన ఈ-కేవైసీ ప్రక్రియను చేసుకునేందుకు రేపే (ఫిబ్రవరి 29) లాస్ట్ డేట్. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డు ఈ-కేవైసీని దగ్గర్లోని రేషన్ దుకాణంలో చేసుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం.. మరోమారు పొడిగించే అవకాశం లేదు.ఈ కేవైసీ చేసుకోకుంటే.. రేషన్ కార్డు కట్ అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ తెలంగాణలో గత ఐదు నెలలుగా కొనసాగుతోంది. రాష్ట్రం ఇప్పటి వరకు 75 శాతం మంది రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునున్నారు. ఇంకా 25 శాతం మంది రేషన్ కార్డు ఈ కేవైసీ (Ration Card KYC) చేసుకోవాల్సి ఉంది. వారు ఈ రెండు రోజుల్లోనే చేసుకోవాలి. ఈ కేవైసీ కోసం సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి.. రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్ ఇవ్వాలి. రేషన్ డీలర్ ఆ వివరాలను బయోమెట్రిక్ మిషన్లో ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత మనం బయెమెట్రిక్ (వేలిముద్రలు) ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకున్న వారి పేరు ఉంచి.. మిగతా వారి పేర్లను తొలగించనున్నారు. రాష్ట్రంలోని ఏ రేషన్ షాపు వద్ద అయినా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లాల్సిన అవసరమూ లేదని, వీలును బట్టి విడివిడిగా వెళ్లి పూర్తిచేయొచ్చని అధికారులు చెప్పారు. అయితే తెలంగాణలో చాలా మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. వారి కోసం రేషన్ కార్డు ఈకేవైసీ గడుపు పెంచాలని కోరుతున్నారు.దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. ఇది ఎన్నికల టైం అయినందున ఈ-కేవైసీ గడువును పెంచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
తెల్లరేషన్ కార్డు లేక..
ప్రజాపాలన దరఖాస్తు చేయడంతో పాటు తెల్లరేషన్ కార్డుకు ఆధార్కార్డు లింకున్న వారు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు జోన్లు హైదరాబాద్ మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్లు ఉండగా, అందులో మొత్తం 9 సర్కిళ్లు ఉన్నాయి. ఆయా సర్కిళ్లలో ప్రాథమికంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ నెల మొదటి వారం నుంచి 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే వారిని గుర్తిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 27నాటికి మొత్తం 10,93,228 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. కాగా ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం గ్రేటర్ పరిధిలో 19.85లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది.
Related News
Congress 6 Guarantees : ఆరు గ్యారెంటీల పట్ల రేషన్ కార్డు లేనివారి ఆందోళన
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్షి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పరిధి పెంచడం చేసిన రేవంత్ సర్కార్..100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantees) అమలు చేయాలనీ చూస్తుంది. ఇందుకోసం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. We’re now on [&hellip