BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!
- By Balu J Published Date - 07:13 PM, Sun - 23 June 24
BRS MLA: ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు.పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు అవ్వ తాత ఉసురు నీకు తాకుతుంది
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని అపోలో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెబితే బహిరంగ క్షమాపణకు సిద్ధంగా ఉన్నానని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం 11 గంటలకు అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తానని, మంత్రి పొన్నం కూడా అక్కడికి రావాలని ఫ్లై యాష్ స్కాం లో డబ్బులు తీసుకోకుంటే వచ్చి దేవుడు సాక్షిగా ప్రమాణం చేయాలని అన్నారు. ఒకవేళ బుధవారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుంటే అదే సమయంలో మీడియా సాక్షిగా మరికొన్ని నిజాలు బయటపెడతానని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జీవో నెంబర్ (18 )2016 ప్రకారం చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే కే పూర్తి అధికారం ఉందని ఆయన అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని ఎమ్మార్వోలకు ఇప్పటికే సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ సమయం ఇవ్వాలంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్ కు వచ్చిన 381 చెక్కులను ఎందుకు పంచనివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోనని హుజురాబాద్ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి నాపైన ఏదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి తప్పా ప్రజల మీద కాదన్నారు. ఈనెల 27 తారీకు వరకు చెక్కుల సమయం ముగుస్తున్నప్పటికీ ఎందుకు పంచడం లేదో చెప్పాలన్నారు. కలెక్టర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి అధికారుల వరకు పద్ధతి ప్రకారం నడుచుకోవాలని లేనియెడల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులకు సంబంధించి బ్లాక్ బుక్కు ప్రిపేర్ చేశామని ప్రస్తుతం తప్పించుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
Related News
AP TDP: జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు
AP TDP: రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని సమాంతరంగా నడిపించగల నాయకులు నారా చంద్రబాబునాయుడు అని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మోటూరు నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయభేరి సభలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారితో పాటు ముఖ్యఅతిథ�